Jr NTR: ఫ్యాన్స్ పై కేసు నమోదుతో హర్ట్ అయిన ఎన్టీఆర్.. ఏం జరిగిందంటే?

Jr NTR: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇటీవలె మే 20వ తేదీన ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు ఏ రేంజ్ లో హంగామా సృష్టించారో మనందరికీ తెలిసిందే. థియేటర్ వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సింహాద్రి సినిమాను రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే మచిలీపట్నంలోని సిరి కృష్ణ,సిరి వెంకటా థియేటర్లకు ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. రెండు మేకలను బలిచ్చి ఎన్టీఆర్ బ్యానర్లపై రక్తాన్ని చిందించారు. ఈ క్రమంలోనే పదునైన ఆయుధాలను బహిరంగంగా తీసుకు రావడంతో పాటు అక్కడ ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రాబర్ట్ సన్ పేట పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. సింహాద్రి సినిమా రిలీజ్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు విజయవాడలోని ఒక థియేటర్ లో టపాసులు పేల్చడంతో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే.

 

ఇప్పటికే పలువురి నుంచి నిందితులను అరెస్టు చేయడంతో ఈ కేసులో భాగంగా ఎన్టీఆర్ ఇన్వాల్వ్ అవుతారా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ జాన్వికపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -