Muzzafarnagar: అలాంటి కేసులో ఒకటో తరగతి కుర్రాడు అరెస్ట్.. ఏమైందంటే?

Muzzafarnagar: ప్రస్తుత కాలంలో మహిళలపై చిన్నారులపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి . వయసుతో సంబంధం లేకుండా ఈ విధమైనటువంటి సంఘటనలు ప్రతిరోజు జరుగుతుంది.ఇక చిన్నారుల సైతం ఈ విధమైనటువంటి అత్యాచారాలకు పాల్పడుతూ వార్తలు నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకటో తరగతి కుర్రాడు రేప్ కేసులో అరెస్ట్ అయిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అసలు ఒకటో తరగతి కుర్రాడు ఏంటి రేప్ చేయడమేంటి అనే విషయానికి వస్తే…

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ముజఫర్‌ నగర్ జిల్లాలోని ఒక పాఠశాలలో ఈ రేప్ జరిగినట్టు బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. మూడేళ్ల ఆ బాలిక ప్లే క్లాస్ చదువుతుంది. అదే స్కూల్లోనే ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థి ఓ రోజు ఆబాలికను స్కూల్ అంతస్తు పైభాగానికి తీసుకెళ్లి ఎవరికీ కనిపించకుండా తనపై అత్యాచారానికి పాల్పడినట్లు చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

రేప్ జరిగిన తర్వాత చిన్నారి ఏడుస్తూ కిందికి రాగా తోటి విద్యార్థులు తనని ఏమైంది అని అడగడంతో తను చెప్పడానికి ప్రయత్నించింది అయితే ఇంటికి వెళ్లిన తర్వాత తన తల్లిదండ్రులు తన చిన్నారి చెబుతున్నటువంటి విషయాలను గమనించి తనపై అత్యాచారం జరిగిందని గుర్తించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ విషయం విన్నటువంటి పోలీసులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

 

ఒకటో తరగతి పిల్లాడు అత్యాచారం చేయడం ఏంటి కనీసం తనకు అలా చేసే ధైర్యం అవగాహన కూడా ఉండదు అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ కుర్రాడిని అరెస్టు చేశారు. ఇక బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.అయినా ఒకటో తరగతి కుర్రాడు రేప్ కేసులో అరెస్ట్ అయ్యారని తెలియడంతో ఈ సమాజం ఎటు పోతుందోనని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్త కష్టాలు మొదలయ్యాయా.. కుట్రలకు బలి కామని జనం చెబుతున్నారా?

YSRCP: ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి రోజుకు రాజుకుంటుందని చెప్పాలి. మరి 20 రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఇప్పటికే పెద్ద ఎత్తున అన్ని పార్టీ నేతలు ప్రచార కార్యక్రమాలను నామినేషన్లను దాఖలు చేస్తూ...
- Advertisement -
- Advertisement -