Ooty: పెళ్ళైన మహిళతో పెయింటర్ అఫైర్.. భార్య కంటే ఆమె ఎక్కువ అంటూ?

Ooty: చాలామంది భార్యాభర్తలు వివాహేతర సంబంధాల మోజులో పడి భార్యాభర్తల బంధాన్ని కూడా కాదనుకొని మధ్యలో వచ్చిన వ్యక్తి కోసం పచ్చని సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. నిత్యం ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నప్పటికీ అటువంటి వారిలో మాత్రం మార్పు రావడం లేదు. అయితే ఈ వివాహేతర సంబంధాల మోజులో పడి ఏం చేస్తున్నారో కూడా అర్థం కాకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడు నిలగీరి జిల్లాలోని ఓల్డ్ ఊటీ ప్రాంతంలో జై శంకర్ అనే వ్యక్తి గతంలో ఓ మహిళను వివాహం చేసుకున్నాడు.

కొంత కాలానికి ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇక భర్త స్థానికంగా పెయింటర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. పుట్టిన పిల్లలను చూసుకుంటూ ఈ దంపతులు సంతోషంగా జీవిస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే గత కొంత కాలం నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో అప్పటినుంచి భార్యతో కాకుండా విడిగా ఉంటున్నాడు జై శంకర్. ఈ క్రమంలోనే అతనికి ఒక మహిళతో పరిచయం ఏర్పడి అధికార వివాహేతర సంబంధం వరకు దారితీసింది. ఇక ఎలాగో భార్యతో దూరంగా ఉంటున్న జయశంకర్ భార్య కంటే ప్రియురాలు ముఖ్యం అనుకొని ఆమెతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ వచ్చాడు.

ఆ తర్వాత ప్రియురాలిని తీసుకొని పెళ్లి చేసుకొని ఏకంగా తన ఇంటికి వెళ్ళగా అతని కుమారులు భార్య ఎవరు కూడా తనతో సరిగా మాట్లాడలేదు. దాంతో తీవ్ర మనస్థాపానికి లోనైనా జయశంకర్ తన రెండవ భార్యని తీసుకొని బొటానికల్ గార్డెన్ వద్దకు వెళ్లాడు. ఆ తరువాత జైశంకర్, రెండవ భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయాత్నానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ వారు అప్పటికే మరణించారని వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారన చేపట్టారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -