OTT: గత కొన్ని రోజుల నుంచి సినిమా థియేటర్లకు, ఓటీటీ సంస్థలకు గట్టి పోటీ అనేది ఎదురవుతూనే ఉంది. పెద్ద సినిమాలు విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ప్రేక్షకులు కూడా తక్కువ ఖర్చుతో ఏడాది పాటు ఓటీటీల్లో సినిమాలు చూసే అవకాశం ఉండటంతో చాలా మంది ఓటీటీలనే సబ్ స్క్రైబ్ చేసుకుంటున్నారు.
అంతేకాదు పెద్ద సినిమాల డిజిటల్ హక్కుల కోసం ఓటీటీ సంస్థలు కూడా భారీగానే ఆఫర్ చేస్తూ పోటీ పడుతున్నాయి. ఈసారి క్రిస్మస్ కానుకగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో సినిమాలు థియేటర్లలో, ఓటీటీలలో విడుదల కానున్నాయి. దాదాపు 18 సినిమాలు రిలీజ్ అవ్వనున్నాయి. మరి అవేంటో ఒకసారి లుక్కేద్దాం.
హీరో విశాల్ లాఠీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విశాల్, సునయన జంటగా ఈ సినిమా తెరకెక్కింది.
అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన కనెక్ట్ అనే సినిమా కూడా ఈ వారమే థియేటర్లలో విడుదల కానుంది. లాఠీ, కనెక్ట్ రెండు సినిమాలు కూడా 22వ తేదీన థియేటర్లలో విడుదల కానున్నాయి.
మాస్ మహారాజ రవితేజ ధమాకా, కుర్ర హీరో నిఖిల్ 18 పేజెస్ సినిమాలు ఈసారి క్రిస్ మస్ కు పోటీ పడనున్నాయి. 23వ తేదీన ఇవి రెండూ థియేటర్లలో విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలపై తెలుగు ప్రేక్షకులకు భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి.
బాలీవుడ్ మూవీ సర్కస్ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చారు. అలాగే ఈ ఏడాది హిట్ సినిమాల్లో ఒకటైన మసూద ఈ నెల 21వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది.
మలయాళంలో హిట్ గా నిలిచిన జయ జయ జయ జయహే ఈ నెల 22వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఎమిలి ఇన్ పారిస్ వెబ్ సిరీస్, ఎలైస్ ఇన్ బోర్డర్ ల్యాండ్, గ్లాస్ ఆనియన్ నైవ్స్ అవుట్ మిస్టరీ కూడా నెట్ ఫ్లిక్స్ లో సందడి చేయనున్నాయి.
కాఠ్ మాండు కనెక్షన్ సోనీ లైవ్ లో విడుదల కానుంది. బిగ్ బెట్ కొరియన్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. జీ5 ఓటీటీలో పిచర్స్ అనే హిందీ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.