YS Jagan: పవన్, బాబు పరువు తీసిన జగన్.. మీరే అంతు చూడాలంటూ?

YS Jagan: జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల పేరిట నెలకు రెండు కార్యక్రమాలను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమానికి ప్రజలను రప్పించి భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ప్రత్యేకంగా సభలు ఏర్పాటు చేసి ఈయన రాజకీయాల గురించి అలాగే ప్రతిపక్ష నేతలను తిట్టడమే పనిగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా జగనన్న విద్య దీవెన పథకాన్ని ప్రారంభించడం కోసం కొవ్వూరుకు వెళ్లారు.

అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ ఎక్కువగా రాజకీయ ప్రసంగాన్నే చేశారు. అయితే ఈ సభలో జగన్ మాట్లాడుతూ తన పార్టీపై తనకే నమ్మకం లేదని చెబుతున్నట్టు ప్రజలు కూడా భావిస్తున్నారు. ఒకప్పుడు వై నాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి వాయిస్ లో కాస్త బేస్ తగ్గిందని తెలుస్తోంది.సింహం సింగిల్ గా వస్తుందని చెప్పిన జగన్ మీ బిడ్డకు అండగా నిలవాలని ప్రాదేయ పడుతున్నారు.

 

ఇలా జగన్ ఏదో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఓట్లు వేయాలి అని ప్రజలను అభ్యర్థిస్తూ ఉండడంతో క్రమంగా తన పార్టీపై తన పార్టీ నాయకులపై జగన్ కి నమ్మకం లేకుండా పోయిందని అందుకే ఇలా ఓట్లు అడుగుతూ కార్యక్రమాలను ఏర్పాటు చేశారని పలువురు భావిస్తున్నారు. ఇక తాజాగా సభలో ఈయన మీ బిడ్డ ఓడిపోతాడని అందరూ అంటున్నారు,మీ బిడ్డను ఓడించడానికి తోడేళ్లంతా ఏకమయ్యారు అంటూ ఈయన పరోక్షంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ప్రసంగం చేశారు.

 

చంద్రబాబు సర్కార్ దోచుకో పంచుకో తినుకో అనే విధంగా వ్యవహరించిందన్నారు. చంద్రబాబు సర్కార్ గజదొంగల ముఠాగా ఏర్పడిందని ఆయన ఆరోపించారు.ఇలా చంద్రబాబు నాయుడుని పవన్ కళ్యాణ్ ను తోడేళ్లు గజదొంగలంటూ జగన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరి వచ్చే ఎన్నికలలో జగన్ కు అండగా ప్రజలు నిలబడతారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -