Pawan Kalyan-Uday Kiran: పవన్ కళ్యాణ్ ఉదయ్ మధ్య అలాంటి గొడవ జరిగిందా?

Pawan Kalyan-Uday Kiran: తెలుగు సినీ ఇండస్ట్రీలో అనేక మంది నటీనటులు వస్తుంటారు. అయితే కొంత మంది మాత్రమే అవకాశాలను అందిపుచ్చుకుని ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు. సినీరంగంలో నిలదొక్కుకోవాలంటే హిట్ల మీద హిట్లు కొడుతూనే ఉండాలి. అనుకున్న స్థాయిలో హిట్లు దక్కక అనేక మంది నటుల జీవితాలు కనుమరుగయ్యాయి. అందులో చిత్రం మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఉదయ్‌ కిరణ్‌ కూడా ఉన్నాడు. 20 ఏళ్ల క్రితమే ఉదయ్‌ కిరణ్‌ టాలీవుడ్‌లో తెరంగేట్రం చేశారు.

 

టాలీవుడ్‌లో ఉదయ్‌ కిరణ్‌ నటించిన మొదటి సినిమా ‘చిత్రం’. ఈ సినిమాతో ఉదయ్‌ కిరణ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో ఆయనకు వెనువెంటనే అవకాశాలు తలుపు తట్టాయి. మనసంతా నువ్వే, నువ్వు నేను లాంటి సినిమాలతో టాలీవుడ్‌లో మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. ఉదయ్‌ కిరణ్‌ సినీ రంగంలో అతి కొద్ది కాలంలోనే నిలదొక్కుకుని తన కాళ్లపై తాను నిలబడ్డాడు. కానీ, అంతే తొందరగా అతను సినీ రంగంలో కోలుకోలేని దెబ్బ తిన్నాడు.

 

– పవన్‌ ఇమేజ్ దెబ్బతీసేందుకే
ఏమైందో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. పిన్న వయస్సులోనే నటుడు ఉదయ కిరణ్‌ మృతిచెందడం.. ఆయన మృతిని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోవడం లేదు. ఉదయ్‌ కిరణ్‌ మృతికి గల కారణాలు ఇప్పటికీ తెలియలేదు. అయితే తాజాగా సీనియర్ దర్శకుడు గీతా కృష్ణ ఉదయ్‌ కిరణ్‌ మరణం గురించి మాట్లాడారు. అతని చావుకు గల కారణాలు తనకు పూర్తిగా తెలియదని పేర్కొన్నారు. అంతేకాదు మరో దర్శకుడు తేజకు ఉదయ్‌ కిరణ్‌ చావుకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసి ఉంటుందన్నారు.

 

పవన్‌ కల్యాణ్‌ ఇమేజ్ దెబ్బతీయడం కోసం కొంతమంది కుట్ర చేశారట. డెక్కన్‌ వాళ్లు బంద్ చేసిన సమీయంలో పవర్‌ స్టార్‌తో గొడవ జరిగిందని, దానిని దృష్టిలో పెట్టుకుని ఉదయ్‌ కిరణ్‌కు అప్పటికే పెళ్లి జరిగినట్లు చిత్రాలతో బయట పెడతామని బెదిరింపులకు పాల్పడ్డారట. ఉదయ్‌ కిరణ్‌, సుష్మితల ప్రేమ వ్యవహారం అప్పట్లో బయటికి రాలేదని, అయితే డెక్కన్ క్రానికల్ వాళ్లు దీనిని వాడుకునేందుకు ప్రయత్నించారు. ప్రేమ వ్యవహారం బయట పెట్టడంతో అందరూ ఖంగు తిన్నారు. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటుడు ఉదయ్‌ కిరణ్‌ వద్దకు వెళ్లి ఆయనపై చేయి చేసుకున్నట్లు తెలిసిందని సీనియర్ దర్శకుడు చెప్పారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: కుప్పంలో గెలుపు కోసం చంద్రబాబు వ్యూహాలివే.. ఎదురుగాలి వీస్తోందని అలా చేస్తున్నారా?

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రజా గళం పేరిట పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే గత కొన్ని దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు కుప్పంలో...
- Advertisement -
- Advertisement -