Poonam Kaur: అరుదైన వ్యాధితో బాధపడుతున్న పూనమ్.. పాపం అంటూ?

Poonam Kaur: టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘వినాయకుడు’ లాంటి పాపులర్ చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నారామె. అయితే మూవీస్ కంటే సోషల్ మీడియా ద్వారానే ఆమె ఎక్కువగా గుర్తింపు సంపాదించారు. అలాంటి పూనమ్ కౌర్ అనారోగ్యానికి గురయ్యారు. ఫైబ్రో మైయాల్జీయా అనే అరుదైన వ్యాధితో ఆమె బాధపడుతున్నట్లు డాక్టర్లు నిర్ధారించారు.

 

ఆందోళన అక్కర్లేదంటున్న కుటుంబీకులు
నిద్రలేమి, కండరాల నొప్పులు, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, చర్మ సంబంధిత సమస్యలు ఫైబ్రోమైయాల్జీయా వ్యాధి లక్షణాలని తెలుస్తోంది. పూనమ్ కౌర్ కు ఈ వ్యాధి ఉన్నట్లు నవంబర్ 18న నిర్ధారణ అయ్యిందట. అప్పటి నుంచి ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఆమె.. ఇటీవల కేరళలోని ఓ ఆయుర్వేద ఆస్పత్రిలోనూ చికిత్స తీసుకున్నారని తెలిసింది. ప్రస్తుతం పుణెలోని తన సోదరి నివాసంలో ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారట. పూనమ్ ఆరోగ్యం మీద వస్తున్న వార్తలపై ఆమె కుటుంబసభ్యులు స్పందించారు. తన హెల్త్ నిలకడగానే ఉందని.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పూనమ్ కుటుంబీకులు తెలిపారు.

త్వరగా కోలుకో పూనమ్..
పూనమ్ పూర్తిగా ఆత్మవిశ్వాసంతో ఉన్నారని ఆమె కుటుంబసభ్యులు చెప్పారు. ఇక తమ అభిమాన నటి ఆరోగ్యంపై రకరకాల వార్తలు వస్తుండటంతో పూనమ్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. పూనమ్ త్వరలో కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇకపోతే, ఇలాంటి అరుదైన వ్యాధితోనే స్టార్ హీరోయిన్ సమంత బాధపడుతున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ అనే వ్యాధితో ఇబ్బంది పడుతున్న సామ్.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

ఇకపోతే, సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన ‘మాయాజాలం’ సినిమాతో పూనమ్ కౌర్ తెరంగ్రేట్రం చేశారు. ఆ తర్వాత ‘ఒక విచిత్రం’, ‘నిక్కి అండ్ నీరజ్’, ‘శ్రీనివాస కల్యాణం’, ‘నెక్స్ట్ ఏంటి’ లాంటి మూవీల్లో ఈ బబ్లీ బ్యూటీ నటించారు. అయితే ‘వినాయకుడు’ సినిమాతో ఆమెకు మంచి పాపులారిటీ లభించింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -