Poorna: మలయాళంకు చెందిన పూర్ణ.. తన అసలు పేరును మార్చుకొని తెలుగులో ‘సీమ టపాకాయ్’తో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాగా ఆడినా కానీ ఆమెకు తర్వాత మాత్రం పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. అల్లరి నరేష్ తో వరుస సినిమాలు చేసిన పూర్ణ.. తర్వాత సిల్వర్ స్క్రీన్ కన్నా బుల్లితెర మీదే ఎక్కువగా కనిపించింది. మరీ ముఖ్యంగా ఈటీవీలో వచ్చే పలు కార్యక్రమాల్లో ఆమె తరుచూ కనిపిస్తూ తెలుగు జనాలకు బాగా దగ్గరైంది.
సినిమా అవకాశాలు లేని పూర్ణ.. ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించి అందరికీ షాకిచ్చింది. కరోనా వల్ల తన పెళ్లికి ఎక్కువ మందిని పిలవలేదని, సదరు పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈటీవీలో వచ్చే ఢీ జోడి కార్యక్రమానికి జడ్జ్ గా వ్యవహరిస్తున్న పూర్ణ.. అప్పుడప్పుడు జబర్దస్త్ లాంటి షోలలో కూడా మెరుస్తుంటుంది. కాగా పూర్ణ పెళ్లికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.
పూర్ణ దుబాయ్ కు చెందిన బిజినెస్ మ్యాన్ షానిద్ ను పెళ్లి చేసుకుంది. తాజాగా వీరిద్దరి పెళ్లి ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా షానిద్ పెళ్లి సమయంలో పూర్ణకు భారీగా కానుకలు ఇచ్చాడని..వాటి విలువ కొన్ని కోట్లు అనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. పెళ్లికి ముందే షానిద్.. పూర్ణకు 2700 గ్రాముల బంగారాన్ని బహుమతిగా ఇచ్చాడని తెలుస్తోంది.
షానిద్ పూర్ణకు ఇచ్చిన బంగారం ఖరీదే రూ.1.30 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే దుబాయ్ లో ఒక లగ్జరీ ఇంటిని కూడా ఇచ్చాడని దీని విలువ ఏకంగా రూ.25 కోట్ల వరకు ఉంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. వీటికి తోడు షానిద్ తను రన్ చేసే కంపెనీ లోని షేర్స్ కూడా రాశాడ. మొత్తంగా షానిద్ పెళ్లికి ముందే దాదాపు రూ.30 కోట్ల విలువైన ఆస్తులు, షేర్లు, వస్తువులను ఇచ్చాడనే ప్రచారం సాగుతోంది.