Posani Krishna Murali: తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన నటుడు పోసాని కృష్ణ మురళి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈయన ఎప్పుడు ఏదో ఒక విషయంతో వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాడు. రాజకీయ నాయకులపై బాగా కామెంట్లు చేస్తూ అందరి దృష్టిలో పడుతూ ఉంటాడు. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయగా ప్రస్తుతం అవి బాగా వైరల్ అవుతున్నాయి.
తాజాగా మురళి కృష్ణ ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని షాకింగ్ విషయాలు బయట పెట్టాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల గురించి కామెంట్లు చేశాడు. జగన్ పై వస్తున్న నెగిటివ్ కామెంట్లను, ప్రచారాలను ఎవరు అడ్డుకోవాల్సిన అవసరం లేదని.. ప్రజల మనసులో జగన్ ఉన్నంతకాలం ఆయనకు రక్షణ అన్నట్లుగా తెలిపాడు.
అంతేకాకుండా ఈనాడు వార్త పత్రికలో ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గురించి గొప్పగా రాశారు అని.. ఆ తర్వాత చంద్రబాబు గుద్దితే ఎన్టీఆర్ కింద పడినట్లు ప్రచారాలు చేశారు అని తెలిపాడు. ఇక సీనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి వయసు 70 ఏళ్లు అని.. ఆమె 30 ఏళ్ల వ్యక్తితో అక్రమ సంబంధం అని ప్రసారం చేశారని అది సిగ్గుచేటు అని అన్నాడు.
ఇక ఈనాడు అధినేత రామోజీరావు, రాధాకృష్ణుని తిట్టారంటే కొత్త భాష కనిపెట్టాలి అని అన్నాడు. ఇక చంద్రబాబు భార్యను ఏమో అంటే కుటుంబం వచ్చారని.. వాళ్ళ సైకాలజీ ఇలా ఉంటుంది అని అన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి గురించి తప్పుగా కామెంట్ చేయగలవా అని ప్రశ్నిస్తూ.. అలా చేస్తే మిమ్మల్ని మొక్కలు ముక్కలు చేస్తారని, చెప్పుతో కొడతారు అని అన్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ముఖ్యమంత్రి అవ్వగలడని.. ఆయనను ఇక ఎవరూ టచ్ చేయరు అని అన్నాడు. ఇక ఆయన మాట్లాడిన మరికొన్ని మాటలు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి.