Prabhas: ప్రభాస్ లంచ్ ఇప్పుడు రెండు వర్గాల మధ్య గొడవలను రేపుతుందా?

Prabhas: టాలీవుడ్ ప్రేక్షకులకు రెబల్ స్టార్ కృష్ణంరాజు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి నటుడిగా తన కంటూ తెలుగు నాట చెరగని ముద్ర సంపాదించుకున్నాడు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు. ఇక ఇటీవల అనారోగ్యం కారణంగా హైదరాబాద్ ఏఐజి ఆస్పత్రిలో మరణించారు.

ఈ విషయాన్ని సినీ రాజకీయ వర్గాలు ఈరోజు వరకు కూడా తీసుకోలేకపోతున్నారు. కాగా రెబల్ స్టార్ కృష్ణంరాజు సంతాపసభను పురస్కరించుకుని మొగల్తూరులో నిన్న ప్రభాస్ ఒక రేంజ్ లో లంచ్ ఏర్పాటు చేశాడు. ఈ లంచ్ లో పెట్టిన రకరకాల డిష్ లు వాటి రేట్లు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక రేంజ్ లో హడావిడి చేస్తున్నాయి. ఇక ప్రభాస్ ఆ రేంజ్ లో లంచ్ ఏర్పాటు చేస్తే చాలామంది ఆనందపడుతున్నారు. కానీ కొంతమంది ట్రోలర్స్ మాత్రం దీన్ని పెద్ద ఫ్యాన్ వార్ గా చేశారు.

ప్రస్తుతం ఈ వార్ మెగా అభిమానుల మధ్య నందమూరి అభిమానుల మధ్య జరుగుతుంది. ప్రభాస్ అంత రిచ్ భోజనం పెట్టాడు. వేల కోట్లు సంపాదిస్తున్న మీ హీరో కనీసం కాపీ కూడా పోయలేదు అంటూ ఒక వర్గం ట్రోల్ చేస్తున్నారు. మరి మీ హీరో ఏం చేశాడంటూ మరొక వర్గం ఒక రేంజ్ లో కామెంట్ల రూపంలో దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని ఎడిట్ చేసిన ఫోటోలు తీసుకొని చిరంజీవి ఎక్కడో లంచ్ చేస్తున్న ఫోటోని సేకరించి అన్ని డిష్ లు ఏర్పాటు చేసారు అని తెలిసి చిరంజీవి ఆపుకోలేక తినడానికి వెళ్లాడని ట్రోల్ చేస్తున్నారు.

దీనికి మరొక వర్గం జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా భోజనం చేసి రాత్రికి తినడానికి భోజనం కూడా క్యారేజీలో సర్దుకుని వెళ్ళాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి ప్రభాస్ లంచ్ ఇద్దరు ఇద్దరు స్టార్ హీరోల అభిమానుల మధ్య పెద్ద దుమారం రేపింది. మరి ఈ గొడవ ఇంకేన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి. ప్రభాస్ అభిమానులు మాత్రం ప్రభాస్ ఏర్పాటు చేసిన లంచ్ గురించి ఒక రేంజ్ లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -