Prabhas: గత కొన్ని రోజులుగా కాంతారా సినిమా గురించి ప్రతి చోటా చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో కాంతారా సినిమా గురించి అవి సాధించిన రికార్డుల గురించే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఆ సినిమా తీసిన డైరెక్టర్ రిషబ్ శెట్టి గురించి ఓ రేంజ్ లో మాట్లాడేసుకుంటున్నారు. ఇన్నాళ్లు ఆ డైరెక్టర్ గురించి అంతగా తెలీదు. అయితే ఇప్పుడు కాంతారా సినిమాను డైరెక్ట్ చేయడమే కాకుండా అందులో హీరోగా నటించి ఆయన రాత్రికి రాత్రే స్టార్ హీరోగా మారిపోయాడనే చెప్పాలి.
కాంతారా సినిమా అటు కన్నడ, తమిళం, ఇటు తెలుగు, హీంది భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సంవత్సరంలో కాంతారా సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ జాబితాలో చేరింది. ఈ పాన్ ఇండియా సినిమా విజయవంతమైన నేపథ్యంలో కాంతారా దర్శకుడు రిషబ్ శెట్టి పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ వస్తున్నారు. ఈ సందర్భంగా తన తదుపరి చిత్రం గురించి కూడా చెప్పుకొస్తున్నాడు. అయితే తాజాగా ఆయన చేసిన పలు వ్యాఖ్యలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
కాంతారా సినిమా విజయం సాధించడంతో చాలా మంది దర్శకుడు రిషబ్ శెట్టికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన్ని మరికొందరు పొగడ్తలతో ఆకాశానికి ఎత్తారు. అందులో ప్రభాస్ కూడా రిషబ్ శెట్టికి ఫోన్ చేసి అభినందించారంట. ఆ సమయంలో ప్రభాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినట్లుగా రిషబ్ శెట్టి తెలిపారు. అయితే బర్త్ డే విషెస్ చెప్పినా ప్రభాస్ పట్టించుకోలేదని, కానీ తన సినిమా కాంతారా గురించి గంట సేపు మాట్లాడాడని రిషబ్ శెట్టి చెప్పుకొచ్చాడు.
హీరో ప్రభాస్ కాంతారా సినిమా గురించి గంట సేపు చర్చించినట్లుగా రిషబ్ శెట్టి తెలిపాడు. అప్పుడు తనకు కాంతారా సినిమా జనాలకు ఎంత బాగా నచ్చిందో తెలిసిందని ఈ డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కాంతారా సినిమా దర్శకుడు రిషబ్ శెట్టి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.