Prabhas-Kriti: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్పై రూమర్స్ కామన్. ఇప్పటికే ప్రభాస్ వయసు 40 ఏళ్లు దాటింది. ఇంత వయసు వచ్చినప్పటికీ ప్రభాస్ పెళ్లి ఊసే తీయడం లేదు. దీంతో ఇప్పటికీ టాలీవుడ్లో ఇదే న్యూస్ హాట్ టాపిక్గా మారింది. అయితే గతంలో అనుష్కతో పెళ్లి చేసుకుంటున్నట్లు పుకార్లు వినిపించాయి. వీరి జోడిని చూసి.. నిజంగానే అనుష్క-ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడనే అనుకున్నారు. రియల్ లైఫ్లో ఈ జోడి పెళ్లి చేసుకోవాలని అభిమానులు కోట్లల్లో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ ఈ జోడికి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
కానీ వీరిద్దరూ ఇప్పటివరకు పెళ్లి మాట తీయడం లేదు. ప్రభాస్తోపాటు అనుష్క కూడా పెళ్లి చేసుకోకుండానే ఉన్నారు. దాంతో సినీ వర్గాల్లో పుకార్లు తలెత్తుతూ వస్తున్నాయి. తాజాగా ప్రభాస్పై మరో పుకారు వినిపిస్తోంది. బాలీవుడ్ నటి కృతిసనన్తో ప్రభాస్ ఎఫైర్ నడుస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం ఉందని ఓ బాలీవుడ్ హీరో చెప్పడం మరింత షాకింగ్కి గురి చేసింది. ప్రస్తుతం ప్రభాస్-కృతిసనన్ జోడిగా ‘ఆదిపురుష్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీత పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రభాస్-కృతిసనన్ మధ్య ప్రేమ చిగురించినట్లు బాలీవుడ్ సినీ వర్గాల్లో పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ చేసిన కామెంట్లు.. ఈ పుకార్లకు ప్రాణం పోశాయి.
తాజాగా వరుణ్ ధావన్ హీరోగా నటించిన సినిమా ‘తోడేలు’. ఈ సినిమాలో హీరోయిన్గా కృతిసనన్ నటించింది. సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం ఫుల్ బిజీలో ఉన్నారు. ఓ ఫోలో యాంకర్ కరణ్ జోహార్.. వరుణ్ ధావన్ను ఓ ప్రశ్న అడుగుతాడు. కృతిసనన్ పేరు నీ మనసులో ఉందా? అని అడుగుతాడు. అప్పుడు వరుణ్.. కృతిసనన్ పేరు వెరొకరి మనసులో ఉందని.. అతడు ముంబైలో లేడని, మరో చోట దీపికా పదుకొణేతో షూటింగ్ చేస్తున్నాడని వరుణ్ ధావన్ చెప్పుకొచ్చాడు. అయితే వరుణ్ ధావన్ కామెంట్లకు కృతిసనన్ నవ్వుతున్నట్లు కనిపించినా.. హ్యాండ్ మూమెంట్తో మాటలను ఆపేంచేసింది. దాంతో ప్రభాస్ మనసులో కృతి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ కూడా హైదరాబాద్లో దీపికా పదుకొనేతో ‘ప్రాజెక్ట్ కే’ షూటింగ్లో ఉన్నారు. వరుణ్ ధావన్ అంత కాన్ఫిడెంట్గా చెప్పడంతో ‘ప్రభాస్-కృతిసనన్’కు మధ్య ఎఫైర్ ఉందని సినీ వర్గాలు చర్చనీయాంశంగా మారింది.