Prabhas-Lokesh: క్రేజీ ప్రాజెక్టులతో గ్లోబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రభాస్ సినిమాలకు సంబంధించిన ప్రతీ అప్డేట్ వైరల్గా మారుతోంది. అయితే తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ ఎప్పటికప్పుడూ కొన్ని క్రేజీ కాంబినేషన్స్ క్రియేట్ చేస్తూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. తాజాగా ప్రభాస్ ఫేమస్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్తో సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ క్రేజీ కాంబినేషన్ రాబోతుందా? అంటే కచ్చితంగా కాదనే చెప్పగలం. ప్రస్తుతానికి ఈ వార్త కేవలం ఫేక్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎవరో ఒక అభిమాని వేసిన ఓ ట్విట్ వల్ల ఈ వార్త వైరల్ అవుతోందని చెప్పవచ్చు.
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. పాన్ఇండియా స్టార్ నుంచి ఏకంగా గ్లోబల్ స్టార్గా ప్రభాస్ క్రేజ్ సంపాదించుకున్నాడు. దాంతో అందరి దర్శకుల కన్ను ప్రభాస్పై పడింది. ప్రభాస్తో సినిమా చేయాలని క్యూ కడుతున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఎనౌన్స్ చేసిన సినిమాలకు తప్పా.. వేరే ఏ సినిమాలకు ఓకే చేసినట్లు కనిపించడం లేదు. ఈ సినిమాల తర్వాతే మరో మూవీకి ఒకే చెప్పే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభాస్ ‘ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్’ సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాలు పూర్తి కావడానికి దాదాపు మూడేళ్లు పడుతుంది.
ఇప్పటికే ఈ సినిమాల పూర్తి చేయడం కోసం ప్రభాస్ రెండు షిప్టులుగా పని చేస్తున్నారట. ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా షూటింగ్లో పాల్గొంటున్నారట. అయితే ఈ టైంలో లోకేష్ కనగరాజ్ సినిమా రాబోతుందంటే కష్టమనే చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని ఫ్యాన్స్ కూడా గుర్తించుకోవాలి. కాగా, లోకేష్ కనగారాజ్ ప్రస్తుతం కోలీవుడ్లో టాప్ డైరెక్టర్గా కొనసాగుతున్నాడు. హీరో రామ్చరణ్తో కలిసి లోకేష్ ఓ సినిమా చేయబోతున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించడానికి కూడా సన్నాహాలు చేసుకుంటున్నారు.