Pune: టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాను వినియోగిస్తూనే ఉన్నారు. అయితే కొంతమంది సోషల్ మీడియాను ఉపయోగించి మంచి మంచి పనులు చేస్తుండగా ఇంకొందరు మాత్రం సోషల్ మీడియాను వినియోగించి చెడు దారుల్లో ప్రయాణించడంతోపాటు చెడువాటికి బానిసలుగా మారుతున్నారు. అయితే చాలామంది ఈ సోషల్ మీడియా మోజులో పడి ఉన్న మనుషులని మాత్రమే కాకుండా మానవత్వం కూడా మరిచిపోతున్నారు. తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రస్తుత రోజుల్లో వాట్సాప్ తెలియని వాళ్ళు ఉండరు. నిత్యం కోట్లాదిమంది ఈ వాట్సాప్ ను వినియోగిస్తూనే ఉన్నారు. వాట్సాప్ లలో కాలేజీ స్కూల్స్ ఆఫీసులో ఇలా అనేక రకాల గ్రూప్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈ గ్రూపులకు అడ్మిన్ గా ఒకరు లేదా ఇద్దరినీ పెడుతూ ఉంటారు. అయితే వాట్సాప్ గ్రూపులో అడ్మిన్ కు కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి అని చెప్పవచ్చు. వాట్సాప్ గ్రూపులో అడ్మిన్ ఏ సభ్యుడిని అయినా కూడా తొలగించవచ్చు. తాజాగా అలాంటి పని చేసినందుకు ఒక వ్యక్తిని చితకబాదడంతో పాటు అతని నాలుకనీ కోసేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటు చేసుకుంది. పుర్సింగిలోని ఓ హౌజింగ్ సొసైటీలో నివసించే వ్యక్తి ఓం హైట్స్ సొసైటి పేరిట ఓ వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేశాడు. ఆ సొసైటీలో నివసించే వ్యక్తులను ఆ గ్రూపులో చేర్చారు.
కొన్నిరోజుల తర్వాత అతను ఓ వ్యక్తిని గ్రూపునుంచి తొలగించారు. అతను ఎందుకు తొలగించారని మెసేజ్ చేయగా రిప్లై ఇవ్వకపోవడంతో కోపంతో ఊగిపోయిన సదరు వ్యక్తి అడ్మిన్ కు కాల్ చేసి కలవాలని కోరాడు. అతను మరో నలుగురు మిత్రులతో కలిసి వెళ్లి వాట్సాప్ గ్రూపు అడ్మిన్ పై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా అతనీ నాలుకను కూడా కోసేసారు. బాధితుడిని గమనించిన స్థానికులు వెంటనే అతని ఆసుపత్రికి తరలించారు. తెగిపడిన నాలుకను వైద్యులు కుట్లు వేసి అతికించారు. బాధితుడి భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం వెతుకుతున్నారు.