Pushpa 2 Team Accident: పుష్ప2 ఆర్టిస్టుల బస్ కి ఆక్సిడెంట్.. అసలేం జరిగిందంటే?

Pushpa 2 Team Accident: టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2. కాగా 2021 లో విడుదల అయిన పుష్ప సినిమాకు సీక్వేల్ గా ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా పుష్ప టీం కి ఒక ఊహించని సంఘటన ఎదురయ్యింది. అదేమిటంటే పుష్ప 2 ఆర్టిస్టుల బస్సు ప్రమాదానికి గురైంది. నార్కట్‌పల్లి దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టిస్టులు వెళ్తున్న బస్సును మరో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఢీ కొట్టింది. ఈ ఘటనలో పలువురు ఆర్టిస్టులకు గాయాలు అయ్యాయి. దాంతో క్షతగాత్రులను వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. షూటింగ్‌ ముగించుకొని వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా పుష్ప 2 కి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం మారేడుమిల్లి లో జరుగుతోంది.

 

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అంతే కాకుండా అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే ఇటీవలె అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ లుక్ కి సంబంధించిన ఫోటోని విడుదల చేయడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అందులో అల్లు అర్జున్ చీర కట్టుకొని ఒక అమ్మవారి లాగా తయారవడంతో ఆ గెటప్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఇప్పటికి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా 50% పూర్తి అయినట్టు తెలుస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -