Rajamouli-Baahubali 3: డైరెక్టర్ రాజమౌళి బాహుబలి 3 గురించి బాహుబలి 2 లోనే హింట్ ఇచ్చాడా!

Rajamouli-Baahubali 3: దేశవ్యాప్తంగా రాజమౌళి ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చిన బాహుబలి సిరీస్ ఏ స్థాయిలో విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ప్రభాస్ వరల్డ్ వైడ్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక రాజమౌళి కూడా ప్రపంచవ్యాప్తంగా డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. దాదాపు పదికాలాలపాటు ఈ సినిమా గురించి చెప్పుకుంటారని చెప్పవచ్చు.

ఇదిలా ఉంటే అమెరికాలో లాస్ ఎంజిల్స్ మూవీ మారథాన్ ఈవెంట్ జరుగుతోంది. సెప్టెంబర్ 30న ప్రారంభమైన ఈ పండుగ అక్టోబర్ చివరి తేదీ వరకు జరుగుతుందని తెలుస్తుంది. ఇక ఈవెంట్లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్, బాహుబలి, ఈగ సినిమాలను ప్రదర్శించారు. అంతే కాకుండా త్వరలో మరి కొన్ని సినిమాలు ప్రదర్శిస్తారట. ఈ ఈవెంట్ లోనే రాజమౌళితో కలిసి క్యూ అండ్ ఏ అనే సెషన్ నిర్వహించారు.

ఈ క్రమంలో బాహుబలి 3 తీస్తారని చెప్పినట్లు అనుప్ దాసరి అనే నెటిజన్ ట్వీట్ చేశాడు. ఆయన చేసిన ట్వీట్‌లో.. ‘మూవీ మారథాన్ తర్వాత ప్రశ్నోత్తరాల సెషన్‌లో రాజమౌళి మాట్లాడారు. రాజమౌళి చేసిన సినిమాల్లో ఒకే ఒక్క క్లైమాక్స్ ఓపెన్ ఎండ్ గా ఒక సంభాషణ పెట్టుకొచ్చినట్లు తెలిపాడు. అది బాహుబలి 2 ముగుస్తున్న చివరి క్షణం లోనే.. అక్కడ ఒక చిన్న అమ్మాయి వాయిస్ ఓవర్ ఉంది.

అది బాహుబలి 3 సంకేతం అన్నట్లు తెలుస్తుంది. మీలో ఎంతమందిని దానిని గమనించారు? అని ఆయన రాసుకొని వచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. మరి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న బాహుబలి సిరీస్, బాహుబలి పార్ట్ 3 తో ప్రేక్షకుల ముందుకు వస్తే బాగుంటుందని చాలామంది అనుకుంటున్నారు. మరి ఈ విషయం గురించి త్రివిక్రమ్ ఇంకా ఏమైనా అప్ డేట్ ఇస్తాడో చూడాలి. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ అభిమానులు మరింత ఆశ్చర్యపోతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -