Ramya: నరేష్ నిజస్వరూపం బయటపెట్టిన రమ్య.. అలా చెబుతూ?

Ramya: సీనియర్ నటుడు నరేశ్ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా నరేశ్, పవిత్రా లోకేశ్ కిస్సింగ్ వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ వీడియో వైరల్ అయ్యాక నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించారు. ఆ ఇంటర్వ్యూలో నరేశ్‌పై ఆమె సెన్సేషనల్ కామెంట్స్ చేసి నరేశ్ నిజస్వరూపాన్ని బయటపెట్టారు. నరేశ్ చాలా దుర్మార్గుడని, ఎంతో మందితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆమె ఆరోపణలు చేశారు.

 

తప్పులన్నీ నరేశ్ చేసి తనపై ఆరోపణలు చేశాడని రమ్య రఘుపతి ఆవేదన చెందారు. దానికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆమె వెల్లడించారు. దేవుడి లాంటి కృష్ణగారితో తనకు వివాహేతర సంబంధం ఉందని నరేశ్ తనను ఆరోపించినట్లు రమ్య తెలిపారు. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆమె వెల్లడించారు. కృష్ణగారి ఇంటి ప్రతిష్ట, మర్యాదలను దృష్టిలో పెట్టుకుని ఇన్ని రోజులూ తాను ఆ నిజాన్ని ఎవ్వరికీ చెప్పలేదని తెలిపారు. కానీ రోజురోజుకు నరేశ్ దారుణాలు ఎక్కువవుతున్నాయని, అందుకే ఈ నిజం చెప్పాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

 

తనని ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని నరేశ్ చేయని పనులంటూ ఏవీ లేవని, చివరికి కృష్ణగారి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి తనకు ఇంజంక్షన్ సూట్ పంపినట్లు ఆమె తెలిపారు. అందులో తన నుంచి కృష్ణకి ప్రాణహాని ఉందని రాయడం తనను ఎంతగానో బాధించిందని అన్నారు. తండ్రి స్థానంలో ఉన్న కృష్ణతో తనకు వివాహేతర సంబంధం ఉందని సూట్‌లో చెప్పినట్లు ఆమె ఆరోపించారు. ఇలాంటి ఎన్నో దారుణాలు చేసి తన నుంచి విడాకులు తీసుకోవాలని నరేశ్ ట్రై చేస్తున్నాడని, కానీ తాను మాత్రం నరేశ్ కు విడాకులు ఇవ్వనని తెలిపారు.

 

కోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని, అన్నీ తాను కోర్టులోనే తేల్చుకుంటానని వెల్లడించారు. పవిత్రను తొలిసారి నరేశ్ తనకు పరిచయం చేసినప్పుడు ఇద్దరం కన్నడలో మాట్లాడుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా తన చేత్తో పవిత్రకు అన్నం వడ్డించానని, చివరికి వారిద్దరూ తనకే ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు నాన్న కావాలని కోరుకుంటున్నాడని అందుకే నరేశ్‌ను వదిలే ప్రసక్తే లేదని రమ్య రఘుపతి తేల్చి చెప్పారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: జగన్ మెప్పు కోసం ఈసీ గైడ్ లైన్స్ ఉల్లంఘిస్తున్న అధికారులు.. కొరివితో తల గోక్కుంటున్నారంటూ?

YS Jagan: ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా అధికారులు వైసీపీ నేతలు అడుగుజాడల్లో నడుస్తున్నారు. మరీ ముఖ్యంగా జగన్ పై స్వామి భక్తి చాటుకుంటున్నారు. అధికారుల వ్యవహారం చూస్తూ ఏపీలో ఈసీ...
- Advertisement -
- Advertisement -