Balakrishna-RGV: నిత్యం వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా ఉంటాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆలియాస్ ఆర్జీవీ. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీ గురించి మాత్రమే మాట్లాడే ఆర్జీవీ ఇప్పుడు, తన దాడిని అన్నీ రంగాలకు విస్తరించాడు. మెున్నటికి మెున్న కుక్క కరిచి చనిపోయిన బాలుడి తరపున సోషల్ మీడియా వేదికగా రచ్చ చేశాడు. హైదరాబాద్ మేయర్పై విరుకుపడ్డాడు. తాజాగా నటసింహం బాలకృష్ణ మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఒకప్పుడు లెజెండ్ డైరెక్టర్గా ఉన్న రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు మాత్రం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ఎప్పుడు ఎవరిపై ఎలాంటి కామెంట్లు చేస్తాడో చెప్పడం చాలా కష్టం. ఆయన ప్రతి విషయంలో కూడా వేలు పెట్టి గెలకకుండా అస్సలు ఊరుకోడు. అదే ఆయన నైజం అంటారు ఫ్యాన్స్. ఎక్కువ శాతం ఆర్జీవో అనవసర విషయాలపైనే కామెంట్లు చేస్తుంటాడు. ఆ మధ్య కాలంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము మీద కూడా చేసి ఆబాసుపాలయ్యాడు. ఆ తర్వాత నాలుక కరుచుకొని తన మాటలను వెనక్కి తీసుకున్నాడు. ఇక ఇప్పుడు బాలయ్యపైనా తమ మార్క్ కామెంట్లు పెడ్డాడు ఆర్జీవీ.
బాలయ్య గురించి చెప్పనక్కర్లేదు. మంచి తనానికి మారుపేరు. కోపం వస్తే, పక్కనున్న వాడు అయిపోయినట్లే. తన ఫ్యాన్స్ మీద కోప్పడటం, ఆయన ఫ్యాన్స్ను కొట్టడం లాంటివి చేస్తూనే ఉంటాడు. అయితే ఆయన అలా చేయడంపై ఆర్జీవీ స్పందించాడు. బాలయ్యకు మానసిక వైద్యం అవసరం అని ఇన్ డైరెక్టుగా కౌంటర్ వేశాడు. అంటే బాలయ్యకు పిచ్చి అని ఇన్ డైరెక్టుగా కామెంట్లు చేశాడన్నాట.
ప్రస్తుతం ఆర్జీవీ చేసిన కామెంట్లు దుమారం రేపుతన్నాయి. ఆర్జీవీపై బాలయ్య ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. నీ లాంటి చెత్తగాడికి ఏం తెలుసు బాలయ్య గురించి. ఆయన్ను దగ్గర నుంచి చూసే వారికి మాత్రమే ఆయన గుణం తెలుస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం బాగా వైరల్ అవుతోంది.