Rishabh Pant: స్టేడియంలో రిషబ్ పంత్ సందడి… ఫొటోలు వైరల్

Rishabh Pant: హైవేపై స్పీడ్‌గా కారు డ్రైవింగ్ చేసుకుంటూ వెళుతుండగా టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రిషబ్ పంత్ కారు ప్రమాదవశాత్తూ డివైడర్‌ను ఢీకొట్టడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. రిషబ్ పంత్ కొద్దిరోజులు ఆస్పత్రిలో చికిత్స పొంది ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు. కొన్ని నెలల పాటు ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నారు.

 

అయితే గాయాలన్ని మానడంతో రిషబ్ పంత్ మళ్లీ బయటకు వస్తున్నాడు. తాజాగా ఐపీఎల్ జరుగుతున్న సందర్భంగా స్టేడియంలో రిషబ్ పంత్ సందడి చేశాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ చూసేందుకు రిషబ్ పంత్ వచ్చాడు. ఢిల్లీ డ్రెస్సింగ్ రూమ్ బయట కూర్చొని మ్యాచ్ ను తిలకించాడు. దీంతో పంత్ చూసి అతడి అభిమానులు కాస్త భావోద్వేగానికి గురయ్యారు.

 

రిషబ్ పంత్ 17, మిస్ యూ పంత్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అలాగే రిషబ్ పంత్ జెర్సీ నెంబర్ 17 స్టేడియంలో ప్రదర్శించారు. వైట్ టీ షర్ట్, షార్ట్ వేసుకుని రిషబ్ పంత్ కనిపించాడు. ఒక కర్రను పట్టుకుని ఉన్నాడు. కర్ర సాయంతోనే స్టేడియంలోకి వచ్చాడు. దీంతో రిషబ్ పంత్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

అయితే గత ఏడాది డిసెంబర్ లో పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో ఈ ఐపీఎల్ కు పంత్ దూరమయ్యాడు. అంతేకాకుండా టీమిండియా మ్యాచ్ లకు కూడా దూరంగా ఉన్నాడు. పంత్ కర్ర సాయంతో నడవడం చూస్తుంటే.. ఇంకా కొంత కోలుకోవాల్సిన అవసరముందని తెలుస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -