Roja: రోజా సంచలన వ్యాఖ్యలు.. దేవుడు కరుణించాడంటూ?

Roja: ఏపీ రాజకీయాల్లో మంత్రి రోజా ఓ సంచలనం. ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. వైసీపీ అధినేత, సీఎం సీఎ జగన్ ను ప్రతిపక్ష నేతలు ఒక్క మాట అన్నా సహించరు. ఒంటి కాలుపై లేస్తారు. సినీ ఇండస్ట్రీలో పాపులర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈమె… అనంతరం రాజకీయాల్లోకి అడుగెపెట్టారు. మంత్రి కాక ముందు వరకు బుల్లి తెరపైన జడ్జిగా వ్యవహరించే వారు. ఆమె మహిళా దినోత్సవం సందర్భంగా ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చించారు. తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.

 

ఫ్యా మిలీ విషయాల్లో నేను చాలా ఎమోషనల్. ఎందుకంటే నాకు ఫైబ్రాయిడ్ ఉంది. పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పేశారు. తర్వాత 2000 సంవత్సరంలో లాప్రోస్క్రో పీ జరిగింది. లాప్రోస్క్రో పీ జరిగిన రెండేళ్లకు పెళ్లైంది. 2003లో నాకు పాప పుట్టింది. అయితే గర్భం దాల్చగానే ఆ విషయాన్ని మా డాక్టర్ కు చెప్పాను. ఆమె సంతోషం వ్యక్తం చేసింది. నీ ప్రార్థనలు భగవంతుడు విన్నాడు, అందుకే నిన్ను కరుణించాడని సంతోషించింది. అసలు పిల్లలు పుట్టే అవకాశం లేదనుకుంటున్న సమయంలో తను నా కడుపున పుట్టింది. అందుకే నాకు పాపంటే ప్రాణం. నా ఇద్దరు పిల్లలకు వారికి నచ్చినట్లే వారి జీవితాలు ఉండాలనుకుంటానని చెప్తూ ఎమోషనలయ్యారు.

ఇక రోజా 1972 నవంబర్ 17న జన్మించారు. నాగార్జున యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ పట్టా అందుకున్నారు. కూచిపూడి నృత్యాన్ని నేర్చుకున్నారు. బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సమయంలో ప్రేమ తపస్సు చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమయ్యారు. దానికంటే ముందు తమిళంలో చంబరతిలో నటించారు. ఆ సినిమా తెలుగులో చేమంతి కింద డబ్ అయింది. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ఆర్కే సెల్వమణితో ప్రేమలో పడగా, పెద్దల అంగీకారంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు. వీరికి కుమార్తె అన్షుమాలిక, కొడుకు కృష్ణ కౌశిక్ ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -