Sachin: క్యాన్సర్ ని సైతం లెక్కపెట్టకుండా భారత్ కోసం పోరాడిన యువరాజ్!

Sachin: 28 ఏళ్ల సంవత్సరాల నిరీక్షణ కు ముగింపు పలుకుతూ 130 కోట్ల మంది గుండెల తీరస్తూ 2011లో భారత్ వన్డే వరల్డ్ కప్ ను గెలుచుకుంది. గ్రౌండ్లో భారత్ టీమ్ కప్పును లిఫ్ట్ చేసి సంబరాలు జరుపుకున్న క్షణం లో ఇండియన్ క్రికెట్ కార్డ్స్ సచిన్ టెండూల్కర్ చిలకాల కోరిక నెరవేరింది. ఈ గొప్ప విజయం సాధించడానికి చెట్టులోని ఆటగాళ్లు తమ సర్వశక్తులు వడ్డి ఆడారు. బ్యాటింగ్ ,బౌలింగ్ ,ఫీల్డింగ్ ఇలా ప్రతి ఒక్క విషయంలో తమ సమర్థత చాటుకుంటూ కష్టపడి కప్పును సాధించారు.

ఇటువంటి పరిస్థితుల్లో వెనకంజ వేయకుండా ప్రాణాలు సైతం పణంగా పెట్టి గ్రౌండ్ను రక్తం కక్కుకున్న ఒక్క అడుగు కూడా గ్రౌండ్ నుంచి బయట పెట్టకుండా దేశానికి వరల్డ్ కప్ సాధించాలి అన్న పట్టుదలతో మొండిగా ఆడి కోట్ల మంది కలలను నెరవేర్చిన ఘనత ఒక్క యువరాజ్ సింగ్ కే దక్కుతుంది. ఒకరకంగా 2011 వరల్డ్‌ కప్‌ లో భారత్ విశ్వవిజేతగా నిలవడానికి కారణం యువరాజ్‌ అని చెప్పవచ్చు.

యువరాజ్ సింగ్ మ్యాచ్లో క్రికెటర్ లాగా కాకుండా ఒక యోధుడి లాగా ఆడాడు. మ్యాచ్ గెలవడం కోసం తన ప్రాణాలు సైతం లెక్కచేయడం అంత తెగువను ప్రదర్శించాడు. అలా సచిన్ చిరకాల కోరికను తీర్చగలిగాడు యువరాజ్. క్రికెట్ ప్రపంచంలో గాడ్ గా పిలవబడే సచిన్ తన ఆటతో ఎదురుగా ఉన్న బౌలర్స్ కు చమటలు పట్టించాడు. ఎన్నో రికార్డులను అపారమైన ఖ్యాతిని తన ఖాతాలో వేసుకున్నప్పటికీ భారత్ కు ప్రపంచ వన్డే వరల్డ్ కప్ సాధించలేకపోవడం అతని కెరియర్లో ఒక చిన్న వెలితిని ఎప్పుడూ ఉంచింది.

2011 వరల్డ్ కప్ ప్రారంభం ముందు ‘వరల్డ్‌ కప్‌ గెలిచి సచిన్‌కు అంకితం ఇస్తాం’అని యువరాజ్ సింగ్ చెప్పడంతో అదే టీమ్ ఇండియా నినాదంగా మారింది. ఎలాగైనా తన ప్రియతమ కెప్టెన్ కోసం కప్పు గెలవాలి అన్న కసితో జట్టు ఆ మ్యాచ్ ఆడడం జరిగింది. ఈ క్రమంలో యువరాజ్ సింగ్ ఇటు బ్యాటింగ్ బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ లోను తన సత్తా చాటుతూ టీమిండియా కు వెన్నుముకలా దృఢంగా నిలబడ్డాడు. ఒకానొక దశలో ఒక గ్రౌండ్లోనే రక్తం కప్పుకున్న వెనుకంజ వేయలేదు. మ్యాచ్ మధ్యలో కుప్పకూలిన యువీని చూసి అందరూ షాక్ అయ్యారు. అప్పటికే భయంకరమైన క్యాన్సర్ తో పోరాడుతున్న యువి ఎవరికి ఈ విషయం చెప్పలేదు. ఎలాగైనా వరల్డ్ కప్ గెలవాలి.. దాన్ని సచిన్ కి అంకితం ఇవ్వాలి అన్న తపన సంకల్పం అతనికి శక్తిని ఇచ్చాయి.

ఫైనల్ లో గంభీర్ , ధోని తో కలిసి యువరాజ్ కూడా మంచిగా పెర్ఫార్మ్ చేశాడు. దీంతో భారత్ విశ్వవిజేతగా నిలబడింది. సచిన్బజాలపై ఎక్కించుకొని గ్రౌండ్ అంతా తిప్పుతూ టీమిండియా సంబరాలు చేస్తూ మురిసిపోయింది. అయితే ఇది జరిగి ఇన్ని సంవత్సరాలు కావస్తున్నా ఇప్పుడు తిరిగి ఆనాటి ముచ్చట్లను సచిన్ మరొకసారి గుర్తు చేసుకున్నాడు. 41 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న యువరాజ్ బర్త్ డే సందర్భంగా పార్టీలో సచిన్ ఆ మధుర క్షణాలను తిరిగి నెమరు వేసుకున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Minister Roja: నాడు అప్పులు నేడు కోట్ల రూపాయల ఆస్తులు.. ఆ పనులు చేసి రోజా కోట్లు సంపాదించారా?

Minister Roja: ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి నగరి ఎమ్మెల్యే రోజా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా పెద్ద ఎత్తైన ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈసారి కూడా తనను గెలిపించే...
- Advertisement -
- Advertisement -