Samantha Niharika: అటు సమంత ఇటు నిహారిక.. ఇద్దరి జతకాలు ఇంత ఘోరమా?

Samantha Niharika: మెగా డాటర్ నిహారిక,భర్త చైతన్య మధ్య గ్యాప్ వచ్చింది అంటూ కదా కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అంతే కాకుండా త్వరలోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్న విడిపోబోతున్నారు అంటూ కూడా జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ వార్తలపై అటు చైతన్య కానీ ఇటు నిహారిక కానీ స్పందించడం లేదు. అయితే చైతన్య, నిహారిక ప్రవర్తన వారు పెట్టే పోస్టులు చూస్తే విడాకుల వార్తలు నిజమే అన్న అనుమానం కూడా కలుగుతోంది. మొదట చైతన్య తనఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన విషయం తెలిసిందే.

తర్వాత నిహారిక సైతం మ్యారేజ్ ఫోటోలను డిలీట్ చేసింది. ఇద్దరు కలిసి జంటగా కనిపించి ఇప్పటికే సంవత్సరం పైగా అవుతోంది.. పెళ్లయిన మొదట్లో వెకేషన్లు తిరుగుతూ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసిన ఈ జంట ఈ మధ్యకాలంలో కలిసి కనిపించడం లేదు. ఈ సమయంలో నిహారిక తన వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టి తన సినీ కెరియర్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌లో నటిస్తూ నిర్మిస్తోంది. రీసెంట్‌గా డెడ్ పికిల్స్ అనే టైటిల్‌తో వెబ్ సిరీస్ లో కూడా నటించి నిర్మించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ మెగా బ్యూటీ వెకేషన్ కోసం బాలి అనే దేశం వెళ్ళింది. అక్కడ వెకేషన్ లో తన ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను నిహారిక తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

 

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇదే సమయంలో నిహారికపై ఆసక్తికరమైన చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నిహారికను సమంతతో పోలుస్తున్నారు. సమంత కూడా విడాకుల సమయంలో ఇలానే చేసిందని,ఆమె తన స్నేహితులతో కలిసి ఇతర దేశాలకు వెకేషన్‌కు వెల్లిందని,డిప్రెషన్ నుంచి బయటికి వచ్చేందుకు సమంత తన స్నేహితుల సహాయం తీసుకుంది.. కొన్ని ఆధ్యాత్మిక ప్రదేశాలకు కూడా ఆ సమయంలో వెళ్ళింది. ఇక ఇప్పుడు నిహారిక వెకేషన్ కి వెళ్లడానికి కూడా విడాకులే కారణమని అంటున్నారు. ఇప్పటికే ఇరు కుటుంబాలు చేసిన సంధి ప్రయత్నాలు కూడా బెడిసి కొట్టాయట. ఇప్పటికే వీరిద్దరు విడాకుల కోసం లీగల్ వర్క్ కూడా మొదలు పెట్టేసారట. అతి త్వరలోనే విడాకులు ప్రకటన కూడా రానుందని అంటున్నారు. ఇలా విడాకులు విషయంలో సమంత నిహారిక మధ్య పోలిక కుదిరిందని నెటిజన్లు అంటున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -