SBI: ఒకప్పుడు ఎక్కువ లావాలేవీలు, ఎక్కువ డబ్బులు డిపాజిట్ చేసే వారు, సిబిల్ స్కోరును బట్టి రికే ఆయా బ్యాంకులు క్రెడిట్ కార్డులు జారీ చేసేవారు. ఇప్పుడు ఎలాంటి డిపాజిట్లు, సిబిల్ లేకున్నా ఒకటి రెండు కార్డులు జారి చేస్తున్నారు. ప్రతి బ్యాంకులు మొదట్లో అద్భుతమైన ఆఫర్లతో
క్రెడిట్ కార్డుల ఇస్తారు. అలా కార్డులకు అలవాటు పడిన తర్వాత వివిధ చార్జీల పేర్లతో అదనపు డబ్బులు వసూలు చేస్తుంటారు.
తాజాగా ఎస్బీఐ దాని వినియోగదారకుల చెమ్మగిల్లేలా షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈఎంఐ లావాదేవీల కోసం తీసుకుంటున్న ప్రాసెసింగ్ ఫీజుపై మరింత ఎక్స్ట్రా రూ. 100 వసూలు చేయనుంది. అంతేకాక కొత్తగా రెంట్ పేమెంట్లపై ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఎక్స్ట్రా చార్జీలు
ఈ నెల( నవంబర్) 15 నుంచి వసూలు చేయనున్నట్లు ఎస్పీఐ కస్టమర్లకు మెసెజ్లు పింపించారు.
ఎస్పీఐ పంపిన సమాచారం ఏంటంటే.. ఎసీబీఐ క్రెడిట్ కార్డు ద్వారా ఇంటి రెంట్ చెల్లిస్తే ఆరెంట్పై రూ. 99+ జీఎస్టీ 18శాతం వసూలు చేయనున్నట్లు మెసెజ్లు పంపింది. ఈ కొత్త నిబంధనలు ఈ నెల నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
ఓ వ్యక్తికి ఉన్న ఇంటి రెంట్ రూ.12వేలను ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో చెల్లించే వారు. బ్యాంకు సైతం ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేసేవి కావు. కానీ తాజాగా ఎస్బీఐ తెచ్చిన నిబంధన మేరకు ఇప్పుడు ఇంటి రెంట్ను రూ.12 వేలు చెల్లించడంతో పాటు అదనంగా ప్రాసెసింగ్ ఫీజు రూ.99, జీఎస్టీ 17.82 శాతం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో పాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై ప్రాసెసింగ్ ఫీజును పెంచింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డును వినియోగించి ఏదైనా వస్తువును కొనుక్కుంటే ఆ వస్తువు ధర ప్రాసెసింగ్ ఫీజు రూ. 199 ఉంటుంది. ఇకపై ఎస్బీ క్రెడిట్ కార్డు ద్వారా ఇంటి రెంట్లు చెల్లిస్తే అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.