Selfie: కొంపముంచిన సెల్ఫీ.. బెదిరించి పలుసార్లు అత్యాచారం?

Selfie: తాజాగా ముంబైలో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. స్నేహితురాలు పుట్టినరోజు వేడుకలో ముద్దు పెట్టుకున్న సమయంలో తీసుకున్న ఫోటోలను బెదిరించి ఆమెపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు ఒక ప్రబుద్ధుడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. దాదాపు 17 ఏళ్ల వయసున్న బాలికకు వయసున్నా ఒక కుర్రాడితో పరిచయం ఉంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 10న బాలిక పుట్టినరోజు కావడంతో అతను బాంద్రాలోని కార్టర్ రోడ్డులో ఆమెను ముద్దు పెట్టుకుంటూ సెల్ఫీ తీసుకున్నాడు. అయితే ఆ సమయంలో అతను తీసుకున్న ఫోటోలను బాలికకు చూపించి ఆమెపై అనేకసార్లు లైంగిక దాడికి ప్రయత్నించాడు.

 

సోషల్ మీడియాలో ఆ పోటోలను పెడతాను అని చెప్పి అతని లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. ఇక అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26 వరకు ఆ బాలికను అనేకసార్లు బెదిరించి అతని కోరికలు తీర్చుకున్నాడు. ఇక అంతటితో ఆగకుండా ఇటీవలే ఆ నిందితుడు మరొకసారి రెచ్చిపోయి బాలిక చదువుకునే కాలేజీకి వెళ్లి తన వెంట రావాలని బలవంతం చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఆ బాలిక అతనితో వెళ్లడానికి నిరాకరించింది. సదరు నిందితుడు రెచ్చిపోయి ఘర్షణకు దిగాడు.

 

అది గమనించిన తోటి విద్యార్థులు బాధితురాలు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో కళాశాల వద్దకు చేరుకున్న ఆ బాలిక తల్లిదండ్రులు ఆమెను నిలదీయడంతో జరిగింది మొత్తం తల్లిదండ్రులకు వివరించింది. బాలికను తీసుకొని ఆమె తల్లిదండ్రులు కేర్వాడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో, అక్కడి నుంచి కార పోలీస్ స్టేషన్కు ఆ కేసును బదిలీ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరుని నిందితుడిని పోక్సొ చట్టం కింద అరెస్టు చేసి అతనిపై కేసు నమోదు చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: ఏపీ సీఎం వైఎస్ జగన్ పేరు మార్చిన చంద్రబాబు.. కొత్త పేరు ఏంటో తెలుసా?

Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజాగళం పేరిట ఈయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ అధికార ప్రభుత్వంపై విమర్శలు...
- Advertisement -
- Advertisement -