Krishna: కృష్ణ విజయనిర్మలను పెళ్లి చేసుకున్నాక ఇందిరాదేవి ఎలా రియాక్ట్ అయ్యిందో తెలుసా?

Krishna: టాలీవుడ్ ప్రేక్షకులకు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి తన నటన గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి అప్పటి టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు. కొంతకాలానికి కృష్ణకు వయసు మీద పడడంతో సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఇక సూపర్ స్టార్ కృష్ణ భార్య ఇందిరా దేవి మనందరికీ తెలిసిందే.

కాగా ఈమె ఈరోజు అనగా సెప్టెంబర్ 28న అనారోగ్యం కారణంగా తన ఇంటిలోనే మరణించారు. ఈ విషయం తెలిసే సీని రాజకీయ వర్గాలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక మహేష్ బాబు అభిమానులు మహేష్ తల్లి చనిపోవడంతో ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందిరా దేవి గారి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సూపర్ స్టార్ కృష్ణ తన మేనమామ కూతురు అయినటువంటి ఇందిరా దేవి ని పెళ్లి చేసుకున్నాడు.

కృష్ణకు మొదటి పెళ్లి అయిన తర్వాత సినిమాల్లో అవకాశాలు బాగా పెరిగాయి. ఈ సమయంలోనే సినీనటి విజయనిర్మల కృష్ణకు పరిచయం అయింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. 1969 లో వీరిద్దరూ తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు అని అప్పట్లో వార్తలు వినిపించాయి. మొదట వీరిద్దరూ ఎవరికి తెలియకుండా రహస్యంగా తెలియజేసుకున్నప్పటికీ.. తర్వాత కృష్ణ తన రెండవ పెళ్లి గురించి ఇంట్లో తెలిపాడు.

ఇక ఈ విషయం తెలియగానే మొదటి భార్య ఇందిరా దేవి ఒక గదిలోకి వెళ్లి కొన్ని గంటల పాటు బయటకు రాలేదట. కొన్ని గంటల తరువాత బయటికి వచ్చిన ఇందిరా దేవి రమేష్ బాబు, పద్మావతిని తన దగ్గరికి తీసుకొని కంట కన్నీరు పెట్టిందట. ఆ సమయం లో ఇందిరా దేవి ఎవరిని ఏ మాట కూడా అనలేదు. ఇక కృష్ణను పన్నెత్తు మాటకూడా అనలేదట.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -