Shriya Saran: తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ శ్రియ.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. తాజాగా శ్రియ నటించిన హిందీ మూవీ దృశ్యం2 విడుదలైంది. ఈ సినిమా సందర్భంగా స్క్రీనింగ్ టైమ్లో శ్రియ తన భర్తకు లిప్ కిస్ ఇచ్చింది. దీంతో నెటిజన్లు కొందరు రెచ్చిపోయారు. శ్రియపై ట్రోలింగ్కు దిగారు. పబ్లిక్ ప్లేసుల్లో ఆ ముద్దులేంటి అంటూ కామెంట్లు పెట్టారు. మీకు ముద్దులు పెట్టుకోవడానికి వేరే టైమే దొరకలేదా అంటూ పలు రకాల కామెంట్లతో హోరెత్తించారు.
వీటిపై ఇటీవల శ్రియ స్పందించారు. ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి చెత్త కామెంట్ల కామెంట్లను పట్టించుకోనని స్పష్టం చేసింది. తన భర్తకు తాను ముద్దిస్తే ఇంత రాద్దాంతం ఏంటిన ప్రశ్నించింది శ్రియ. తాను ట్రోల్స్ని లెక్కచేయనని తెలిపింది. భార్యాభర్తలైన తామిద్దరం ముద్దుపెట్టుకోవడాన్ని కూడా తప్పు పట్టి ట్రోల్స్ చేయడం తనకు కామెడీగా అనిపిస్తోందని తెలిపింది శ్రియ.
భార్యా భర్తల మధ్య ఒక సహజమైన చర్యను ఎందుకు తప్పు పడుతున్నారో అర్థం కావడం లేదని శ్రియ పేర్కొన్నారు. తనకు ఎంతో ప్రత్యేకమైన సమయంలో తన భర్త ముద్దు పెట్టుకోవాలని అనుకున్నారని, అలా చేయడం తప్పేంద కాదని శ్రియ తెలిపింది. ఇవి తనకెంతో అందమైన క్షణాలుగా శ్రియ అభివర్ణించింది. ఇలాంటి ఆనందకర క్షణాలను కూడా తప్పుపట్టడం భావ్యం కాదంది.
ట్రోలర్స్కు ఎప్పుడూ ఇదే పని అని, వాటిని తాను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. తన పనేంటో తాను చూసుకుంటానని స్పష్టం చేసింది. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ట్రోలర్స్కు గట్టిగా కౌంటర్ ఇచ్చినట్లయ్యింది. ప్రస్తుతం హిందీలో శ్రియ దృశ్యం2 మూవీలో నటించారు. అజయ్ దేవగణ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం.. ప్రారంభం నుంచే హిట్ టాక్ తెచ్చుకొని దూసుకెళ్తోంది. నవంబర్ 18న ఈ మూవీ రిలీజైంది.