Shriya Saran: పబ్లిక్‌లో అలాంటి పనులు చేస్తున్న శ్రియ.. పరువు పోయేలా?

Shriya Saran: తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ శ్రీయ. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది. స్టార్ హీరోల సరసన నటించి.. తన అందం, అభినయం, నటనతో అందరినీ కట్టిపడేసింది. ఇప్పటికీ ఆమె నటిగానే కొనసాగుతోంది. సినీ ఫీల్డ్ లో హీరోయిన్ల వయసు పెరిగే కొద్ది అవకాశాలు రావడం తగ్గుతుంటాయి. కానీ శ్రీయ విషయంలో అది ఎప్పుడూ జరగలేదు. ఇంత వయసులో కూడా ఎంతో క్యూట్‌గా హాట్‌గా కనిపిస్తుంటారు. టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ వైపు కన్నేసింది ఈ భామ. తాజాగా శ్రీయ ‘గమనం’ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా శ్రీయ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

 

 

తాజాగా శ్రీయ నటించిన మరో చిత్రం ‘దృశ్యం-2’. ఈ సినిమా నేడు రిలీజ్ అయింది. ఈ సినిమాలో శ్రీయ, బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగన్, టబు కీలక పాత్రల్లో నటించారు. అయితే ముంబైలో ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్‌కి సెలబ్రిటీలందరూ వచ్చారు. అజయ్ దేవగన్ భార్య కాజోల్, శ్రీయ భర్త కొశ్చివ్ కూడా వచ్చారు. ఇందులో శ్రీయ రెడ్ శారీ కట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన అందం, హోయలతో అందరినీ తన వైపు తిప్పుకుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. రెడ్ శారీలో శ్రీయను చూస్తున్న నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నాలుగు పదుల వయసులో కూడా మతిపోగొడుతోందని కామెంట్లు చేస్తున్నారు.

 

 

శ్రీయ నటించిన చాలా వరకు సినిమాల్లో ‘వాలు చూపు’ ఉన్న సన్నివేశాల్లో ఎంతో రొమాంటిక్‌గా నటించింది. అందుకే అభిమానులు ఆమెను ‘సెక్సీ చూపుల సుందరి’ అని పిలుస్తూ ఉంటారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. ప్రివ్యూ పూర్తయ్యాక శ్రీయ, కొశ్చివ్ ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే పబ్లిక్ ప్లేస్‌లో శ్రీయ-కొశ్చివ్ బరితెగించేశారు. బహిరంగంగానే లిప్‌కిస్ చేసుకున్నారు. దాంతో నెటిజన్లు మండిపడుతున్నారు. పబ్లిక్ ప్లేస్‌లో ముద్దులు పెట్టుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో రొమాన్స్ చేయడం శ్రీయ-కొశ్చివ్‌కు కామన్ కావడంతో లైట్ తీసుకున్నారు. కాగా, రాజమౌళి దర్శకత్వంలోని ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో శ్రీయ కీలక పాత్రలో నటించారు. అజయ్ దేవ్‌గన్ భార్య పాత్రలో శ్రీయ మెరిసింది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -