Adipurush: ఆదిపురుష్ మూవీ విషయంలో ఇన్ని మార్పులా?

Adipurush: టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్గా నటించిన విషే తెలిసింది ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదల కాగా ఈ టీజర్ పై భారీగా ట్రోలింగ్స్ పెద్ద ఎత్తున నెగటివ్ కామెంట్స్ వినిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ అలాగే రావణాసురుడు పాతలో నటించిన సైఫ్ అలీ ఖాన్ పాత్రలు గెటప్ల విషయంలో తీవ్ర విమర్శలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని చాలా రోజులైనా విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల కాకముందే టీజర్ పైనే భారీగా ట్రోలింగ్స్ నెగటివ్ గా కామెంట్స్ వినిపించడంతో ఈ సినిమాలో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించుకున్నారు చిత్ర బృందం.

 

దీంతో ఈ సినిమా విడుదల తేదీని పోస్ట్ పోన్ చేస్తూ ఈ సినిమా లేటుగా విడుదలవుతుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో గ్రాఫిక్స్ విషయంలో చాలా మార్పులు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో మార్పులు చేర్పులు చేయడం కోసం దాదాపుగా 100 కోట్ల ఖర్చులు చేస్తున్నారు మూవీ మేకర్స్. ఎలా అయినా ఈ సినిమా హిట్ అయ్యి మంచి కలెక్షన్స్ ను సాధించాలి అన్నదే లక్ష్యంగా పెట్టుకొని ఈ సినిమా కోసం ఎక్కువగా కష్టపడుతున్నారు. అంతేకాకుండా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండేలా చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

 

ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో చేస్తున్న మార్పులు ఇంకా పెరిగాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మొన్నటి వరకు ఈ సినిమాలో ప్రభాస్ పాత్రకి సంబంధించి ఎటువంటి మార్పులు చేయలేదని వార్తలు వినిపించాయి. పని తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ పాత్రలో కూడా కొన్ని మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ ముఖం అలాగే గెటప్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. వార్త విన్న డార్లింగ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో చాలావరకు ప్రభాస్ అన్ని సన్నివేశాలలో ఉండడంతో ప్రతి ఒక్క సన్నివేశంలో ప్రభాస్ ముఖాన్ని మార్చుతుండడంతో ఈ సినిమా విడుదల అవ్వడానికి ఇంకా చాలా సమయం పట్టేటట్టుగా కనిపిస్తోంది. దీంతో ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -