Sri Reddy: శ్రీరెడ్డికి రూ.5 కోట్ల ఆఫర్.. జాతకమే మారిపోయిందా?

Sri Reddy: వివాదాస్పద నటి శ్రీరెడ్డి గురించి తెలుగు వారందరికీ తెలిసిందే. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ టాపిక్ తీసుకొని బూతులు మాట్లాడుతూ హల్ చల్ చేస్తూ ఉంటుంది. ఇలా వార్తల్లో నిలవాలనేదే ఆమె టార్గెట్ అనే విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. క్యాస్టింగ్ కౌచ్ పేరిట ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సినిమాల్లో పెద్దగా రాణించలేకపోయినా ఇలా కాంట్రవర్సీలతో ఫేమస్ అయ్యింది శ్రీరెడ్డి.

మీటూ ఉద్యమంలో భాగంగా నటుడు దగ్గుబాటి అభిరామ్ పై సంచలన ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. సినిమాల్లో అవకాశాల పేరు చెప్పి తనను వాడుకొని వదిలేశాడని ఆరోపించింది. ఇందుకు సంబంధించి ఇద్దరూ ముద్దులు ఇచ్చుకున్న ఫొటోలు కూడా విడుదల చేసింది. మరోవైపు సినిమా ఇండస్ట్రీలోని చాలా మందిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఇప్పటికీ హల్ చల్ చేస్తోంది శ్రీరెడ్డి.

ఫేస్ బుక్, యూట్యూబ్ లో శ్రీరెడ్డి లైవ్ వస్తోందంటే బోలెడు మంది ఎగబడి చూసే స్థితికి చేరుకుంది. హీరో నానిపై కూడా ఆరోపణలు చేసింది. ఆ సమయంలో సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్లు బాగా వైరల్ అయ్యాయి. ఏదైనా గొడవ జరుగుతోందంటే అందులో వర్మ దూరిపోతాడు. కాంట్రవర్సీలంటే ఆర్జీవీకి మహా ఇష్టం.

మధ్యవర్తిత్వం చేసిన ఆర్జీవీ..

నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు అభిరామ్ పై శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన నేపథ్యంలో, ఆ కామెంట్లను వెనక్కి తీసుకోవాలని శ్రీరెడ్డితో మాట్లాడానని ఆర్జీవీ తెలిపాడు. ఈ వివాదాన్ని పరిష్కరించాలని తాను ప్రయత్నించానని చెప్పాడు. ఇందుకు శ్రీరెడ్డికి రూ.5 కోట్లు ఆఫర్ చేశానన్నాడు. అయితే, ఆ డబ్బును కాదని వెళ్లిపోయిందంటూ ఆర్జీవీ సంచలన అంశాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు మరోసారి వైరల్ అయ్యాయి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -