Sridevi: అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఇటీవల సినిమాలతో బిజీగా గడుపుతోంది. శ్రీదేవి వారసురాలిగా రాణించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో అమ్మ వారసురాలిగా కాకుండా సొంత ప్రతిభతో పైకి రావాలని కష్టపడుతోంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సుమారు నాలుగేళ్లయినా మంచి హిట్ కోసం వెయిట్ చేస్తోంది ఈ అందాల నటి.
తాజాగా చెన్నైలోని శ్రీదేవి ఇంటిని, ఇతర విశేషాలను జాన్వీ కపూర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇంద్రభవనం లాంటి ఆ ఇంటితో తనకున్న అనుబంధాన్ని జాన్వీ గుర్తు చేసుకుంది. హిందీ మూవీ దఢక్తో సినిమా రంగానికి పరిచయమైంది జాన్వీ కపూర్. తాజాగా మిలి సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకొస్తోంది జాన్వీ. దఢక్ తర్వాత గుంజన్ సక్సెనా, ఘోస్ట్ స్టోరీస్, అంగ్రేజీ మీడియం, రూహి చిత్రాలతో తన నటనా కౌశలాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. అనంతరం సీనియర్ హీరోయిన్ నయనతార హిట్ మూవీ కోలమావు కోకిల రీమేక్ సినిమాలో జాన్వీ నటించింది.
ఇక సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది జాన్వీ కపూర్. హాట్ పోజులు, అందాల ఆరబోతతో వీడియోలు, రీల్స్ చేస్తూ యువతలో క్రేజ్ సంపాదించుకుంటోంది. ఇక హోమ్ టూర్ విషయానికి వస్తే.. ఆ వీడియోలో వింతలు విశేషాలు చెప్పుకొచ్చింది జాన్వీ. హాయ్ అని పలకరించి తమ ఇంట్లోకి ఆహ్వానించించింది. తమ ఇల్లు ప్రధాన ద్వారం వాస్తు ప్రకారం ఉందని పేర్కొంది. తర్వాత బోనీ కపూర్ కార్యాలయం చూపించింది. బోనీ కపూర్ చుట్టూ 10 వేల ఫొటోలు ఉన్నాయని వివరించింది.
అందుకే బాత్రూమ్ డోర్కు గడియ ఉండదు..
చెన్నై ఇంట్లో శ్రీదేవి కొన్నేళ్లుగా సేకరించిన పెయింటింగ్స్, ఆర్ట్ పీసులను జాన్వీ కపూర్ చూపించింది. ఇందులో శ్రీదేవి స్వయంగా వేసిన పెయింటింగ్స్ కూడా ఉంటం విశేషం. జాన్వీ కపూర్ తన తల్లిదండ్రుల పెళ్లి ఫొటోలను కూడా వీడియోలో చూపించింది. అనంతరం తన పడక గదిని చూపించింది జాన్వీ. తన గది బాత్ రూమ్ కు గడియ ఉండదని పేర్కొంది. బాత్రూమ్లోకి వెళ్లి అబ్బాయిలతో ఫోన్లో మాట్లాడానేమో అనే భయంతో అమ్మ శ్రీదేవి బాత్ రూమ్కు లాక్ పెట్టేందుకు అంగీకరించలేదని తెలిపింది జాన్వీ. అది ఇప్పటికీ అలాగే ఉందని పేర్కొంది. ఈ ఇంటితో ఎన్నో జ్ఞాపకాలున్నాయని తెలిపింది.