SriReddy: హైపర్ ఆదికి శ్రీరెడ్డి వార్నింగ్.. ఏం జరిగిందంటే?

SriReddy: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే శ్రీ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. జబర్దస్త్ స్టార్ కమెడియన్ హైపర్ ఆదిపై ఒక రేంజ్ లో విరుచుకుపడింది. అయితే ఇటీవలే జనసేన పార్టీ నిర్వహించిన రణస్థలం సభలో హైపర్ ఆది పంచల వర్షం కురిపించాడు. ఇప్పుడు ఇదే టాపిక్ పై శ్రీ రెడ్డి తనదైన శైలిలో కౌంటర్లు వేసింది.

‘డైపర్ ఆది జంబలకడి జారు మిఠాయి’ అనే టైటిల్ పెట్టి ఫేస్ బుక్ వేదికగా శ్రీరెడ్డి రెచ్చిపోయింది. హైపర్ ఆదిపై బూతుల పురాణం ఎత్తుకోవడానికి ఫేస్ బుక్ లైవ్ నిర్వహించింది. ఆదికి గురువైన నాగబాబు దగ్గర నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా విమర్శలు గుప్పించింది. ‘అసలు ఆదికి సిగ్గు లేదని పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన ప్యాకేజీలో ఆది ఒక భాగమని, దానిలో ఆదికి కూడా కొంత ప్యాకేజీ అందిందని’ నోటికి వచ్చినట్లు వాయించేసింది. ‘అసలు అమ్మాయిలు అంటేనే పడని ఆది బ్రాహ్మణ కులంలో ఎలా పుట్టాడో అర్థం కావడం లేద’ని అంది.

మొత్తానికి తన బోల్డ్ డైలాగ్స్ తో హైపర్ ఆది కి మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది శ్రీరెడ్డి. పవన్ కళ్యాణి రెండు చోట్ల పోటీ చేస్తే ఓడిపోయాడు నువ్వు ఎలా గెలుస్తావో ఆ పార్టీ ఎక్కడ నిలబడుతుందో అంటూ దుమ్మెత్తి పూసింది శ్రీరెడ్డి.

అయితే మరోపక్క ఆది తనదైన శైలి పంచులతో షోలను నిర్వహిస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు. మల్లెమాల వారు నిర్వహిస్తున్న ప్రతి షోలో ముఖ్యపాత్ర పోషిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. జనసేన తరుపున ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -