Ketika Sharma: కేతిక శర్మ అందాల ఆరబోత.. ఎంత హాట్‌గా ఉందో?

Ketika Sharma: ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లు పరిచయమైనప్పటికీ.. కొంతమందికి మాత్రమే సరైన గుర్తింపు లభిస్తుంది. ఇండస్ట్రీకి వచ్చిన వారిలో కొంతమంది హీరోయిన్లు మాత్రమే మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. ఇక వారి అందచందాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటారు. అలా మొదటి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో కేతిక శర్మ ఒక్కరు. వరుస సినిమాలతో ఇండస్ట్రీలో సందడి చేస్తుంది ఈ భామ. ఈ బ్యూటీ నటించిన సినిమాలు మంచి విజయం సాధించలేకపోయినప్పటికీ వరుస అవకాశాలను అందుకుంటుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉంటుంది.

కేతిక మోడలింగ్ రంగంలోనూ రాణించారు. తన అందచందాలతో ప్రేక్షకులను అలరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే కొన్ని రకాల బ్రాండ్లకు ప్రచారకర్తగా కూడా పని చేశారు. కేతిక 2016లో ‘థగ్ లవ్’ అనే యూట్యూబ్ వీడియోలో నటించారు. ఈ వీడియోకి భారీ రెస్పాన్స్ రావడంతో ఆమెకి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో కేతిక సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్‌తో పాటు అభిమానులను సంపాదించుకుంది. కేతిక పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ హీరోగా నటించిన ‘రొమాంటిక్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయినప్పటి కేతికకు మాత్రం మంచి గుర్తింపు తెచ్చింది.

ఇండస్ట్రీలో హిట్, ప్లాప్‌లతో సంబంధం లేకుండా కేతిక శర్మ వరుస అవకాశాలను అందుకుంటుంది. ఈ బ్యూటీ నాగశౌర్య హీరోగా నటించిన ‘లక్ష్య’ సినిమాతో మరోసారి ప్రేక్షుకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. ఇక పంజా పవర్ స్టార్ వైష్ణవ్ తేజ్ హీరోగా కేతిక శర్మ హీరోయిన్‌గా నటించిన సినిమా ‘రంగరంగ వైభవంగా’. ఈ సినిమా కూడా విజయాన్ని సొంతం చేసుకోలేపోయింది.

ఇక కేతిక శర్మ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. తనకు సంబంధించిన హాట్ ఫోటోలను అభిమానులకు పంచుకుంటారు. దీంతో సోషల్ మీడియాలోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇటీవల ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ ఫోటోలో కేతిక శర్మ షర్ట్ విప్పేసి ఎద అందాలతో కుర్రకారులను ఉర్రూతలూగించింది.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -