Nandigama: ఇలాంటి కీచక తండ్రులను ఉరి తీయాలి.. నెటిజన్ల కామెంట్స్ వైరల్!

Nandigama: రోజు రోజుకి సమాజంలో ఆడవారి పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది. ఇంట బయట ఆఫీసులలో ఇలా ఎక్కడ చూసినా కూడా వారిపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కన్న తండ్రి తోడబుట్టిన అన్న ఇలా వావి వరసలు మరిచి కూడా కామందులు రెచ్చిపోతున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. భర్త వేధింపులు తాలు లేక పుట్టింటికి వస్తే కాపాడాల్సిన కన్నతండ్రి కాలయముడయ్యాడు.

ఈ దారుణమైన ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చోటు చేసుకుంది. నందిగామ మండలం అంబారుపేట గ్రామానికి చెందిన మహిళకు, గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. అయితే పెళ్లయిన కొన్ని నెలలకే భార్యాభర్తల మధ్య అభిప్రాయ బేధాలొచ్చాయి. దీంతో వివాహిత తన పుట్టింటికి వచ్చేసింది. అలా ఇంట్లోనే ఉన్న కూతురుపై ఆ దుర్మార్గపు తండ్రి కన్నేశాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒకసారి, రెండు సార్లు కాదు దాదాపు రెండేళ్లుగా ఇదే వ్యవహారం నడుస్తోంది.

 

ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అలా రెండేళ్లుగా నరకం చూసిన ఆ మహిళ, ఇక తప్పని పరిస్థితుల మధ్య నందిగామ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఆ దుర్మార్గపు తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు సాగుతోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రూపింది. అతడి దుర్మార్గపుగురించి తెలుసుకున్న స్థానికులు అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయని జగన్.. ఇంతకంటే ఘోరం ఉందా?

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో భాగంగా పాదయాత్ర చేస్తూ ఎన్నో హామీలను ఇచ్చారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు భారీ స్థాయిలో ఎన్నికల హామీలను ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి...
- Advertisement -
- Advertisement -