Sushmitha: సొంత ట్యాలెంట్ తో, ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లో అడుగు పెట్టి.. టాలీవుడ్ కే పెద్దన్నలా మారిపోయారు చిరంజీవి. ఇక అభిమానులు, సినీ జనులు మెగాస్టార్ అని పిలుచుకునేంత స్థాయి ఆయన సొంతం. పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు గ్రామంలో కొణిదెల వెంకట్రావు, అంజనా దేవి దంపతులకు 1995 ఆగస్టు 22వ తేదీన జన్మించిన ప్రథమ సంతానం చిరంజీవి.
చిరు 25 సంవత్సరాల ప్రాయంలో 1980 లో సుప్రసిద్ధ నటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖను పెళ్లి చేసుకున్నాడు. వీరికి మొత్తం ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు సుష్మిత, శ్రీజ కూతుళ్లు.. కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మొత్తానికి వీరి ఫ్యామిలీకి ఇండస్ట్రీలో ఉన్న గౌరవం అంతా ఇంతా కాదు. అలా మెగా ఫ్యామిలీ టాలీవుడ్ లో జెండా పాతింది.
పెద్ద కూతురు సుష్మిత అలా..
చిరు కూతురు, రామ్ చరణ్ అక్క సుస్మిత. చెన్నైలో ఉండే విష్ణు ప్రసాద్ తో ఈమె వివాహం జరిగింది. విష్ణు ప్రసాద్ కుటుంబం రాయలసీమ నుండి వెళ్లి తమిళనాడులో స్థిరపడింది. అప్పట్లో వీరి కుటుంబం పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించేవి. జపాన్, సింగపూర్, అమెరికా వంటి దేశాలతో వారు వ్యాపారాలు చేసేవారు. లావాదేవీలు నడిపేవారు. చదువు పూర్తయ్యాక విష్ణు ఏ వ్యాపారాలు చూడడం ప్రారంభించాడు.
ఇక విష్ణు ప్రసాద్ బాధ్యతలు తీసుకున్నాక వ్యాపారం మరింత అభివృద్ధి చెందింది. ఇక ఇటీవల విష్ణు ప్రోత్సాహంతో సుష్మిత సినీ రంగంలో ప్రవేశించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ స్టూడెంట్ అయిన సుష్మిత.. సినీ రంగంలో కాస్ట్యూమ్ డిజైనర్ గ రాణిస్తుంది. ఇటీవల చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది సుస్మిత. దీనితో ఆమె సినీ రంగంలో మరిన్ని ప్రాజెక్టులు చేసే అవకాశం కనిపిస్తుంది.