Tabu: సినీ ఇండస్ట్రీలో ఎఫైర్లు కామన్. ప్రేమ పేరుతో కొన్నేళ్ల పాటు సహజీవనం చేసి.. ఆ తర్వాత మనస్పర్థలు రావడం వల్ల విడిపోయిన జంటలను చాలా మందినే చూస్తుంటాం. కొందరు సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుని కూడా విడాకులు తీసుకుంటారు. ఇండస్ట్రీలో హీరో-హీరోయిన్లు, నిర్మాతలు-హీరోయిన్లు చాలా కనిపిస్తుంటాయి. కానీ హీరోయిన్లు-క్యారెక్టర్ ఆర్టిస్టులు, విలన్- హీరోయిన్ల లవ్ ఎఫైర్లు మాత్రం కొంచెం స్పెషల్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరూ సినిమాలో నటించిన నెగిటివ్ రోల్లోనే అలరిస్తారు. అలాంటి వాళ్లు నిజజీవితంలో ఎలా ప్రేమలో పడతారనేదే ప్రశ్నార్థకం. సీనియర్ హీరోయిన్ టబు కూడా ఈ లెక్కలోకే వస్తుంది.
నటి టబు 50 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉంది. హైదరాబాద్లోనే నివసిస్తూ.. కాలం వెళ్లదీస్తోంది. అయితే టబుది స్వస్థలం హైదరాబాదే. ఆమె అక్క ఫరా కూడా సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా కొనసాగారు. ఆమె బాటలోనే టబు కూడా ఇండస్ట్రీలోకి వచ్చింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్కి ‘కూలీ నంబర్.1’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కింగ్ నాగార్జునతో కలిసి ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా చేసింది. ఆ తర్వాత మళ్లీ నాగార్జునతోనే కలిసి ‘ఆవిడా మా ఆవిడే’ సినిమాలో నటించింది. ఈమె నటించిన వరుస సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. దాంతో ఆమెకు ఆఫర్లు రావడం ఎక్కువయ్యాయి.
అయితే నాగార్జునతో కూడా లవ్లో పడింది. బాలీవుడ్లో మంచి ఆఫర్స్ వచ్చినా.. కేవలం నాగార్జున కోసం టాలీవుడ్లోనే కొనసాగింది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ బాలీవుడ్ వైపు అడుగులేసింది. బాలీవుడ్లో సినిమాలు చేసేటప్పుడు విలన్గా కొనసాగుతున్న మనోజ్ బాజ్పాయ్తో ప్రేమలో పడింది. ఆయనతో కలిసి ఒకే ఏడాదిలో ‘దిల్ పే మత్ లే యార్, ఘాత్’ అనే రెండు సినిమాలు చేసింది. నెల రోజుల వ్యవధిలోనే ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుందనే దర్శకనిర్మాతలు కూడా ఆఫర్లు ఇచ్చేవారట. అప్పట్లో టబు-మనోజ్ ప్రేమ వ్యవహారం బాగా వైరల్ అయింది. వీరిద్దరూ వరుసగా సినిమా చేసింది. మనోజ్ కూడా తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘కొమరం పులి’ సినిమాలో విలన్గా నటించాడు. ఆ తర్వాత బాలీవుడ్లో కుర్ర హీరోల తాకిడికి తట్టుకోలేక హైదరాబాద్కు వచ్చేసింది. ఆ తర్వాత టాలీవుడ్లో ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. స్టార్ట్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ.. టబు ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తోంది.