Balakrishna: ఇందిరా దేవి మరణంతో కృష్ణ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన బాలయ్య?

Balakrishna: టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య ఇందిరాదేవి గత నెల 28వ తేదీ అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఇందిరాదేవి మరణ వార్త తెలుసుకున్నటువంటి ఎంతోమంది సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున ఇదిరా దేవి చివరి చూపు కోసం తరలివచ్చారు. ఈ విధంగా ఇందిరాదేవి మరణించిన సమయంలో నందమూరి బాలకృష్ణ తన సినిమా షూటింగ్ పనుల నిమిత్తం టర్కీ వెళ్లారు.

ఈ క్రమంలోనే కృష్ణ కుటుంబ సభ్యులను కలవలేకపోయినా బాలకృష్ణ తాజాగా మహేష్ బాబు కృష్ణని కలిసి తన సానుభూతి ప్రకటించారు. ఇందిరా దేవి మరణించి 11 రోజులు అయిన తర్వాత ఆమె సంస్కరణ సభను ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో నిర్వహించారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి కొందరి సినీ ప్రముఖులను ఆహ్వానించారు.

ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ ఈ సంస్కరణ సభలో పాల్గొన్నారు.ఇలా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈయన మహేష్ బాబు కృష్ణ గారితో మాట్లాడి వారిని పరామర్శించి వారి కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఇకపోతే మహేష్ బాబు తన తల్లి ఇందిరా దేవి అంత్యక్రియలను ఆమెకు నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాలను హిందూ సంప్రదాయాల ప్రకారం అన్ని పూర్తి చేశారు. ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం హరిద్వార్ లోని గంగా నది ప్రాంతంలో ఇందిరా దేవి అస్థికలను కలిపినటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే తన తల్లి 11వ రోజు సంస్కరణ సభ కూడా పూర్తి కావడంతో మహేష్ బాబు సోమవారం నుంచి త్రివిక్రమ్ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -