Vennela Kishore: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో.. క్యారెక్టర్ ఆర్టిస్టులకు అంతే వ్యాల్యూ ఉంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న వారిలో ‘సంధ్యా జనక్’ ఒకరు. ఇప్పటివరకు ఎంతో మంది స్టార్ హీరోల తల్లి పాత్రల్లో నటించారు. ‘అర్జున్ రెడ్డి, భరత్ అనే నేను, గీతా గోవిందం లాంటి సినిమాల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోలు, హీరోయిన్లకు తల్లి పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. పలు ఇంటర్వ్యూలల్లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్పై కూడా సంధ్యా జనక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రకాశ్ రాజ్ ఒక లెజెండ్ నటుడని, కాకపోతే అతడికి షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉంటుందన్నారు. ఎన్నో సినిమాల్లో నటించడం వల్ల అతనికి ఆ అనుభవం వచ్చి ఉంటుందన్నారు. ప్రకాశ్ రాజ్తో నటించడానికి తనకు భయంగా అనిపించేదని, డైలాగ్ సరిగ్గా చెప్పకపోతే అతనికి ఎక్కడ కోపం వస్తుందనే భయం తనలో ఎల్లప్పుడూ ఉండేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
తాజాగా మరో ఇంటర్వ్యూలో సంధ్యా జనక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యాంకర్.. మీకు ఎలాంటిపాత్రలంటే ఇష్టమని అడిగినప్పుడు.. ‘సినిమాల్లో నాకు మంచి రోల్లో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతాను. సాధారణంగా నాకు మదర్ రోల్ ఎక్కువగా సూట్ అవుతుంది. అందులో నేను న్యాచురల్గా యాక్ట్ చేస్తుంటాను. ఇంట్లో నా పిల్లలతో ఎలా ఉంటానో.. స్క్రీన్పై కూడా అంతే న్యాచురల్గా ఉండటానికి ప్రయత్నిస్తాను. నా పాత్రపై డైరెక్టర్ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యేంత వరకు ట్రై చేస్తుంటాను. తల్లి పాత్రల్లోనే కాకుండా పవర్ ఫుల్ రోల్స్ చేయడానికి ఇష్టపడతాను. అలాగే నెగిటివ్ షేడ్స్ లో నటించడం ఇష్టం.’ అని సంధ్యా జనక్ చెప్పుకొచ్చారు. అలాగే యాంకర్ మరో ప్రశ్నను అడిగారు. ఓ సినిమాలో సగం రెమ్యూనరేషన్ ఇచ్చారని, వెన్నెల కిషోర్ సినిమాలో వేరే ఫోటో మార్పింగ్ ఇష్యూ అయిందన్న విషయంపై అడిగారు. దానికి ఆమె జవాబిస్తూ.. ‘అల్లరి నరేష్ హీరోగా నటించిన యముడికి మొగుడు సినిమాకు సగం డబ్బులు మాత్రమే ఇచ్చారు. నిర్మాతలకు లాస్ వచ్చిందని సగం రెమ్యూనరేషన్ మాత్రమే ఇచ్చారు. అలాంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అలాగే వెన్నెల కిషోర్తో ‘అతడు ఆమె ఓ స్కూటర్’ సినిమా చేశాను. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి థంబ్నైల్పై వేరే అమ్మాయి ఫోటో పెట్టి.. టైటిల్లో నా పేరు మెన్షన్ చేశాడు. అందరూ ఆ ఫోటోలో ఉన్నది నేనే అనుకున్నారు. కానీ వీడియో చూసినప్పుడు అందరికీ అర్థమైంది.’ అని చెప్పుకొచ్చారు.