Srireddy: పరువు తీసుకుంటున్న శ్రీరెడ్డి.. ఇంతకు మించి దిగజారడం అవసరమా?

Srireddy: తెలుగు సినీ ప్రేక్షకులకు శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వరకు ఈమె సుపరిచితమే. కాగా శ్రీరెడ్డి తరచూ ఏదో ఒక వివాదంతో వివాదాస్పద వ్యాఖ్యలతో, వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ విషయంలో శ్రీరెడ్డి బాగా పాపులర్ అయ్యింది. ఇక అప్పటి నుంచీ ఏదో ఒక విషయంలో ఆమె తరచుగా వార్తలు నిలుస్తూనే ఉంది. తనకు సంబంధం లేని విషయాలు లో కూడా ఆమె కలుగజేసుకొని మాట్లాడి లేనిపోని వివాదాలను తెచ్చుకుంటూ ఉంటుంది.

 

అంతేకాకుండా సమాజంలో జరిగే పలు విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ నెటిజెన్స్ నుంచి ట్రోలింగ్స్ ను సైతం ఎదుర్కొంటూ ఉంటుంది. ఎవరు ఎన్ని విధాలుగా ట్రోలింగ్స్ చేసిన నెగటివ్ కామెంట్స్ చేసినా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటుంది. ముఖ్యంగా శ్రీ రెడ్డి మెగా ఫ్యామిలీని తరచుగా టార్గెట్ చేస్తూ నాగబాబుపై పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతూ బూతులు మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పటికే చాలా సందర్భాలలో ఫేస్బుక్ లైవ్ లోకి వచ్చి పవన్ కళ్యాణ్ ని నాగబాబుని బండ బూతులు తిట్టిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ ప్రారంభించిన వారాహి యాత్ర గురించి స్పందిస్తూ కౌంటర్ వేసింది శ్రీ రెడ్డి. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఈ విధంగా రాసుకొచ్చింది. న‌న్ను కూడా ఎక్కించుకుని రెండు రౌండ్లు వేయ‌వ‌చ్చుగా అంటూ కామెంట్స్ చేసింది. దీంతో అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతూ ఆమెపై నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.ఇంకా చెప్పాలి అంటే అమ్మ‌నా బూతులు తిడుతున్నారు. నీ పరువు నువ్వే తీసుకుంటున్నావు కదా శ్రీరెడ్డి ఇంత దిగజారిపోవడం అవసరమా అంటూ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -