Director: ఆ డైరెక్టర్ గురించి మాట్లాడితే కెరీర్ వృథా.. ఏం జరిగిందంటే?

Director: డైరెక్టర్ పరశురామ్ అలాగే హీరో నాగచైతన్య కాంబినేషన్లో అనుకున్న సినిమా మల్ల గుల్లాల. జరిగిందో ఏమో తెలియదు కానీ చైతన్యతో అనుకున్న ఈ సినిమా లాస్ట్ మినిట్ లో వద్దనుకొని మహేష్ బాబు దగ్గరికి వెళ్లారు పరశురామ్. ఆ తర్వాత మళ్లీ మహేష్ బాబుని వద్దనుకొని విజయ్ దేవరకొండ దగ్గరికి జంప్ అయ్యారు. అయితే ఈ సినిమా విషయంలో పరుశురామ్ కు భారీగా అడ్వాన్స్ ఇచ్చి వడ్డీలు కట్టుకుంటున్న 14రీల్స్ అధినేతలు ఈ విషయంలో గట్టిగా పట్టుకున్నారు. ఆ సమస్య అలా నలుగుతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా పరుశురామ్ గురించి నాగచైతన్య పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

హీరో నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం కస్టడీ. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా గడుపుతున్నారు నాగచైతన్య.. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా నాగచైతన్య మాట్లాడుతూ.. ఏం జరిగిందో మీకు తెలుసు…ఆయన నా టైమ్ వేస్ట్ చేసారు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుకోవడం టైమ్ వేస్ట్ అంటూ ఒకింత అసహనం వ్యక్తం చేశారు నాగచైతన్య. ఇకపోతే నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా విషయానికి వస్తే.. ఇందులో చైతన్య సరసన కృతీశెట్టి హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

 

ఈ సినిమా తప్పకుండా సక్రెట్స్ ఆడిస్తుందని అభిమానులు చిత్ర బృందం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చైతన్య నటించిన గత రెండు సినిమాలు కూడా ఆశించిన విధంగా సక్సెస్ ను సాధించలేకపోయాయి. గత ఏడాది సంక్రాంతికి కానుకగా విడుదలైన బంగార్రాజు సినిమా పరవాలేదు అనిపించేలా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. మరోసారి కస్టడీ సినిమాతో ఈ జంట ప్రేక్షకులను పలకరించనుంది.

 

Related Articles

ట్రేండింగ్

BJP: బీజేపీ కూటమికి బలం అవుతుందా.. బలహీనత అవుతుందా.. ఇంత దారుణమైన పరిస్థితులా?

BJP:  భారతదేశంలో బీజేపీ కి ఎంత బలం ఉన్నా తెలుగు రాష్ట్రాల వద్దకు వచ్చేసరికి బీజేపీ బలం ఎందుకు పనికిరాదు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కి ఎక్కువ మద్దతు లేకపోవడంతో బీజేపీ తెలివిగా...
- Advertisement -
- Advertisement -