Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ వల్లే తెలుగులో కాంతార మూవీ హిట్టైందా?

Jr NTR: అప్పట్లో కన్నడ ఇండస్ట్రీ అంటే అందరికి చిన్నచూపు ఉండేది. కన్నడ పరిశ్రమలో సినిమాలను తక్కువ బడ్జెట్‌లో నిర్మించి రిలీజ్ చేస్తుండేవారు. కానీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా నటించిన సినిమా కెజిఎఫ్. ఈ సినిమా కన్నడ చిత్ర పరిశ్రమను చేంజ్ చేసిందనే చెప్పాలి. ఈ చిత్రంతో దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలు కన్నడ చిత్ర పరిశ్రమ వైపు తిరిగి చూశాయి. కెజిఎఫ్ సినిమా దేశవ్యాప్తంగా విడుదల చేయడంతో పాటు హీరో యష్‌కి పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇక కెజిఎఫ్-2 కూడా ప్రేక్షకులను అదే తరహాలో ఆకట్టుకుంది. తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమలో మరో సినిమా సంచలనం సృష్టిస్తోంది.

తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమలో సెన్సేషనల్ హిట్ అందుకున్న సినిమా ‘కాంతార’. ఈ చిత్రంలో కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా నటించాడు. అంతేకాదు ఈ చిత్రానికి హీరో రిషబ్ శెట్టినే దర్శకత్వం వహించాడు. డివోషనల్ కథతో నిర్మించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ విడుదలై చాలారోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికి థియేటర్స్ లో విజయవంతంగా సినిమా ప్రదర్శన కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు, కన్నడ సహా హిందీ భాషల్లో నడుస్తూ ఉండగా మరో పక్క సినిమా ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా ఓటీటీపై చిత్ర నిర్మాత కార్తీక్ గౌడ శుక్రవారం క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ మూవీ నవంబర్‌లో అయితే స్ట్రీమింగ్ కాదని, కానీ డిసెంబర్ నుంచి అయితే స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్, అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రావొచ్చని అన్నారు. ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే కన్నడలో ఈ చిత్రానికి హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించగా.. తెలుగులో గీతా ఆర్ట్స్ నిర్మాణం బాధ్యతలు వహించారు.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన మరో వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో రిషబ్ శెట్టి జూనియర్ ఎన్టీఆర్‌ను తెగ పొగిడేస్తున్నారు. అంతేకాదు.. ఎన్టీఆర్ తల్లి ఊరు, రిషబ్ శెట్టి సొంతూరు ఒకటేనని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ అభిమానులు కూడా కాంతార మూవీపై ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే కాంతార మూవీ సక్సెస్ సాధించడానికి తారక్ కూడా కారణమయ్యారు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -