Tarak: తారక్ గురించి శ్రీదేవి కూతురు కామెంట్లు వింటే ఫ్యాన్స్ కు పూనకాలే?

Tarak: సినీ ఇండస్ట్రీలో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ శ్రీదేవి. అనుకోని స్థితిలో దుబాయ్ లో బాత్ టబ్ లో పడి చనిపోయిన శ్రీదేవి వారసురాలిగా.. జాన్వీ కపూర్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ‘దడ్కన్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. మొదటి సినిమాతోనే హిట్ కొట్టింది. ఇక దక్షిణాదిలో ఎంతో పాపులర్ అయిన శ్రీదేవి వారసురాలు జాన్వి కూడా దక్షిణాది సినిమాలు చేయాలనే వార్తలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి.

 

ఒకప్పుడు తెలుగు, తమిళంలో ఓ వెలుగు వెలిగిన శ్రీదేవి వారసత్వాన్ని ఆమె కూతురు జాన్వి కూడా కొనసాగించాలని అభిమానులు కూడా కోరుతున్నారు. అయితే జాన్వి కపూర్ దక్షిణాదిలోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఎంట్రీ ఇవ్వబోతోందనే వార్తలు చాలా కాలంగా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వీటిపై జాన్వి కపూర్ స్వయంగా స్పందించింది. తన సినిమా ‘మిలి’ ప్రమోషన్లో భాగంగా ఇంటర్య్వూలిస్తున్న జాన్వి కపూర్ ఎన్టీఆర్ తో సినిమా గురించి క్లారిటీ ఇచ్చింది.

 

తాను ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు రావడం చూశానని, అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన చర్చలు తన వరకు రాలేదని జాన్వి కపూర్ స్పష్టతనిచ్చింది. ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశాన్ని ఎలా వదులుకుంటామని.. ఎన్టీఆర్ తో జోడి కట్టడానికిి తాను సిద్ధంగా ఉన్నట్లు జాన్వి చెప్పకనే చెప్పింది.

 

మరోపక్క నిర్మాత, జాన్వి కపూర్ తండ్రి బోనీ కపూర్ మాత్రం దక్షిణాది సినిమాల్లోకి తన కూతురు ఎంట్రీపై భిన్నంగా స్పందించారు. జాన్వి ఇంకా అనుభవం గడించాలని, దక్షిణాది నిర్మాణ విలువలకు ఆమె సిద్ధం కావాల్సి ఉందని అన్నారు. ఆమె అలా సిద్ధమైనప్పుడు దక్షిణాదిలో తాను సినిమా చేయడానికి సిద్ధమని బోనీ కపూర్ ప్రకటించారు. కానీ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి జాన్వి కపూర్ సిద్ధంగా ఉండటంతో ఆమెను దక్షిణాది ప్రేక్షకులు త్వరలోనే వెండి తెర మీద చూసే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Vizag Steel Plant: మూసివేత దిశగా విశాఖ ఉక్కు.. జగన్ సర్కార్ చేతకాని పాలనకు నిదర్శనం ఇదే!

Vizag Steel Plant:  విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఆనుకొని ప్రభుత్వం నిర్మించిన గంగవరం పోర్టుని ఆదాని గ్రూప్ పూర్తిగా హస్తగతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వారం రోజులుగా ఈ పోర్టులో...
- Advertisement -
- Advertisement -