Team India: బిర్యాని సెంటర్‌ పెట్టిన టీమిండియా స్టార్‌ పేసర్.. మెనూ చూస్తే షాకవ్వాల్సిందే..!

Team India: టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమి ఓ బిర్యాని సెంటర్ తెరిచాడు. అందులో స్పెషల్ మెనూ అంటూ ఓ ప్రత్యేకమైన బోర్డు కూడా పెట్టాడు. కాకపోతే అక్కడ దొరికేది చికెన్, మటన్ బిర్యానీలు కాదండీ.. డాట్ బాల్ బిర్యాని, ఇన్ స్వింగ్ బిర్యాని, యార్కర్ బిర్యాని లాంటివే తన దగ్గర లభిస్తాయని షమి ఫేస్ బుక్ అకౌంట్లో ఒక ఫొటో పోస్టు చేశాడు.

షమి బిర్యానీని ఏ బ్యాట్స్‌మెన్‌ తింటాడో..!

షమి బిర్యాని సెంటర్‌ పేరుతో ఉ‍న్న ఆ పోస్టర్‌లో అతడు చెఫ్‌ వేషంలో ప్లేట్‌లో క్రికెట్‌ బాల్స్‌ పట్టుకుని దర్శనమిచ్చాడు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. మంచి మెనూ కార్డు, ఐపీఎల్‌లో, రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌లో సర్వ్‌ చేయండి అంటూ నెటిజన్లు, క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి, షమి తన బిర్యానీని ఎవరికీ ఇష్టంగా పెడతాడో.. ఏ బ్యాట్స్‌మెన్‌ దాన్ని తింటాడోననేది చూడాలి.

 

ఇకపోతే, మహ్మద్ షమి తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. గాయంతో కొన్నాళ్లు టీమిండియాకు దూరమైన ఈ సూపర్ ఫాస్ట్ బౌలర్.. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కమ్ లో కమ్ బ్యాక్ ఇచ్చాడు. భారత్ జట్టు సెమీస్ లోనే వైదొలిగినప్పటికీ షమి మాత్రం తన ఆటతీరుతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. దీటైన బౌలింగ్ తో ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించాడు.

 

టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు వరకు షమి పేరులో ప్రాబబుల్స్ లో లేదు. అయితే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంజ్యురీ కారణంగా జట్టుకు దూరమవ్వడంతో అనూహ్యంగా షమీని జట్టుకలోకి తీసుకున్నారు సెలెక్టర్లు. సీనియర్ పేసర్ కావడం, ఆస్ట్రేలియా కండీషన్స్ లో ఆడిన అనుభవం కూడా ఉండటంతో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా షమీని తుది జట్టులోకి తీసుకున్నారు. అందుకు తగ్గట్లే ప్రాక్టీస్ మ్యాచుల నుంచి సెమీస్ వరకు షమి రాణించాడు. తన మీద అందరూ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ మంచి ప్రదర్శన చేశాడు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: ఓటమి భయంతోనే జగన్ కు కోపం.. వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు!

Pawan Kalyan: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీ అధినేతలు ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు ఈ క్రమంలోనే కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇటీవల...
- Advertisement -
- Advertisement -