Balayya-Thaman: బాలయ్య ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త చెప్పిన థమన్!

Balayya-Thaman: నందమూరి బాలకృష్ణ హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమా ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను, ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తున్నాయి. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయనుందా అని ఎంతగానో చూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతగానో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

 

తాజాగా వీరసింహారెడ్డి సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు మ్యూజిక్ ను ఎస్ఎస్ థమన్ అందించారు. ఈ సినిమాలో పాటలు మాత్రమే కాదు బీజీఎంలు కూడా అదిరిపోయేలా ఉన్నాయట. బీజీఎం నెక్ట్స్ లెవెల్‌లో ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా చెప్పాలంటే బాలయ్య ఆఖరి సినిమా అయిన ‘అఖండ’లో బీజీఎం ఎంతలాగా ఉందో మీకే తెలుసు. అంతకుమించి సౌండ్ ఉండేలా ఇందులో ప్లాన్ చేశారట.

అఖండ సినిమాకు థమన్ ఇచ్చి బీజీఎం ప్రేక్షకులకు తెప్పించింది. కొన్ని థియేటర్లలో అయితే ఏకంగా సౌండ్ ఎక్కువగా ఉందంటూ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత చాలా తక్కువ సౌండ్‌తో ఆ సినిమాను ప్లే చేసిన సందర్భాలు కూడా మనం చూశాం.

 

తాజాగా ‘అఖండ’ సినిమాను మించిపోయే రేంజ్‌లో వీరసింహారెడ్డి బీజీఎం ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. సంగీత దర్శకుడు థమన్ మరోసారి ఈ సినిమా కోసం బాక్సులు బద్దలయ్యే బీజీఎం ఇచ్చాడని చిత్ర యూనిట్ చెప్పడం విశేషం. మరి వీరసింహారెడ్డి బీజీఎంతో థియేటర్లు ఎలా రీసౌండ్ ఇస్తాయో చూడాలంటే జనవరి 12వ తేది వరకు ఆగాల్సిందే. ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ కుర్రకారును తన అందంతో ఫిదా చేయనుందట. బాలయ్యకు మంచి జోడి అని చిత్ర యూనిట్ తెలుపుతోంది.

Related Articles

ట్రేండింగ్

Roja: నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిలా మారిన రోజా.. శత్రువులే తప్ప మిత్రులు లేరా?

Roja:  నగరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి రోజా ప్రస్తుతం నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిగా మారిపోయారు. ఈమె 2014 ఎన్నికలలో వైసిపి నుంచి గెలుపొందారు. అలాగే 2019 సంవత్సరంలో కూడా 2...
- Advertisement -
- Advertisement -