Sai Pallavi: ఆ పాటంటే సాయిపల్లవికి ఇంత ప్రాణమా.. ఏమైందంటే?

Sai Pallavi: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చివరగా విరాటపర్వం, గార్గి సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన సాయి పల్లవి ఆ తర్వాత ఎటువంటి సినిమాలు నటిస్తోంది? ఏ సినిమాలో చేయబోతుంది అన్న విషయాలపై ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన కూడా లేదు. అందుకు సంబంధించి వార్తలు కూడా వినిపించడం లేదు. మొన్నటికి మొన్న ఆమె ముంబై విధుల్లో కనిపించడంతో ఆమె బాలీవుడ్లో సినిమా చేస్తుందని వార్తలు వినిపించాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇప్పటిదాకా హీరోలు మాత్రమే చేసే ఓ పనిని ఇప్పుడు సాయిపల్లవి చేస్తున్నారని కోలీవుడ్‌ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు.

ఇంతకీ ఆ పని ఏంటంటే?సాయిపల్లవి మేకోవర్‌ అవుతున్నారు. అందుకే ఇప్పుడు మరే సినిమానూ చేయడం లేదు. టైమ్‌ తీసుకుని మేకోవర్‌ అవుతున్నారు. ఈ సినిమాలో శివకార్తికేయన్‌ హీరోగా నటిస్తారు అంటూ కోలీవుడ్‌ లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే కథ వినగానే నచ్చితే వెంటనే సైన్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటోంది సాయి పల్లవి. తాను ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ అలాంటివేననీ ఆమె చెబుతోంది. తనకు బాగా నచ్చిన పనిని తాను చేస్తూ ఉంటే, చుట్టూ ఉన్న జనాలందరూ ప్రేమను పంచి ఆదరిస్తుంటారని,అది భగవంతుడు తనకు ప్రసాదించిన వరమని అంటారు అంటోంది సాయి పల్లవి. తెలుగులో ఆ మధ్య లేడీ పవర్‌స్టార్‌ ఇమేజ్‌కి దగ్గరయ్యారు సాయిపల్లవి.

చూడ్డానికి నేచురల్‌గా కనిపించే ఈ బ్యూటీ, మేకప్‌ విషయంలో కూడా స్పష్టమైన అభిప్రాయాలతో ఉంటారు. మేకప్‌ కచ్చితంగా మహిళల్ని అందంగా చూపిస్తుందని, దాన్ని క్యారీ చేయగలిగిన వాళ్లు చేయొచ్చని, తాను అంత కంఫర్ట్ గా ఫీల్‌ కానని అంటారు పల్లవి. సాయి పల్లవి డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాయి పల్లవి డాన్స్ కి ఎవరైన ఫిదా కావాల్సిందే. సాయి పల్లవి కూడా సినిమాలు చేసిన అందులో డాన్స్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉన్న పాటలను ఎంచుకుంటూ ఉంటుంది. అయితే తానెప్పుడూ పనిగట్టుకుని డ్యాన్సులు నేర్చుకోలేదని, మాధురీ దీక్షిత్‌, ఐశ్వర్య రాయ్‌ డ్యాన్సులు చూస్తూ పెరిగానని, డోలా రే డోలా పాటకు నిద్రలో లేపినా స్టెప్పులు వేస్తాను అని తెలిపింది సాయి పల్లవి.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -