Kaikala: ఆ లెజండరీ యాక్టర్ చనిపోయే ముందు అలా అనుకున్నారట..కైకాల ఆఖరి కోరిక తీరలేదట

Kaikala: కైకాల సత్యనారాయణ లేడనే వార్త ఇప్పుడు అందర్నీ కలచివేస్తోంది. శనివారం ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. 70-80వ దశకంలో కైకాల సత్యనారాయణ సీరియస్ విలన్ రోల్స్ చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. పౌరాణిక చిత్రాల్లో తన ఆహార్యానికి తగిన భీముడు పాత్రలు వేసేవారు. యముడు పాత్రలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ అని అప్పట్లో అందరూ చెప్పుకునేవారు. వెండితెర యముడంటే కైకాల సత్యనారాయణే అని అనుకునేవారు. యమగోల మూవీలో మొదటిసారి కైకాల ఆ పాత్ర చేసి అందర్నీ ఆకట్టుకున్నారు.

ఆ తర్వాత యముడికి మొగుడు, యమలీల వంటి పలు హిట్ సినిమాల్లో ఆయన నటించి మెప్పించారు. 2012లో విడుదలైన దరువు చిత్రంలో చివరిగా ఆయన యముడు పాత్ర వేయడం విశేషం. ఇక మాయాబజార్ మూవీలో ఎస్వీఆర్ చేసిన ఐకానిక్ రోల్ ఘటోత్కచుడు గా కూడా కైకాల సత్యనారాయణ నటించి మెప్పించారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన ఘటోత్కచుడు చిత్రంలో కైకాల ఆ పాత్ర వేసి తన నటనను చూపించారు.

60 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో కైకాల చేయని పాత్ర లేదు, వేయని వేషం లేదంటే మీరు నమ్మి తీరాల్సిందే. ఇకపోతే హీరో, విలన్, కమెడియన్, క్యారెక్టర్ రోల్స్ వంటివి చేస్తూ ఆయన నటుడిగా గొప్ప పేరు సాధించారు. అయితే ఈ లెజెండరీ యాక్టర్ ఒక కాంబినేషన్ లో నటించాలని అనుకునేవారట. వి. రామచంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీస్టారర్ దేవుడు చేసిన మనుషులు సినిమాలో ఎన్టీఆర్-కృష్ణ హీరోలుగా నటించారు. ఈ మూవీలో జగ్గయ్య, సత్యనారాయణ కీలక రోల్స్ పోషించారు.

ఆ తర్వాత జనరేషన్ లో టాప్ స్టార్స్ గా అవతరించిన చిరంజీవి-బాలకృష్ణ కలిసి మల్టీస్టారర్ చేస్తే చూడాలని, అందులో కైకాల నటించాలని అనుకున్నారట. అయితే ఆయన కోరిక తీరలేదని చెప్పాలి. కొందరు ప్రయత్నం చేసినా ఈ కాంబో సెట్ కాలేదని, అయితే ఎన్టీఆర్-రామ్ చరణ్ కలిసి ఆర్ఆర్ఆర్ లో నటించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందట.

Related Articles

ట్రేండింగ్

Big Shock to Vanga Geetha: వైసీపీ అభ్యర్థి వంగా గీతకు వరుస షాకులు.. సమస్యలు పరిష్కరించకుండా ఓట్లు అడుగుతారా?

Big Shock to Vanga Geetha: మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఏపీ మొత్తం ఒకవైపు అయితే...
- Advertisement -
- Advertisement -