Krishna Vamsi: కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం రంగమార్తాండ. అలాగే రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్, శివాత్మిక రాజశేఖర్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇళయరాజా సంగీతం అందించగా,మరాఠీ ఫిలిం నటసామ్రాట్కు రీమేక్గా రూపొందింది. ఈ సినిమా ఈ నెల 22 న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. అయితే విడుదల తిరిగి మరి కొద్ది రోజులే సమయం ఉండడం ఎమోషన్స్ ని వేగవంతం చేశారు మూవీ మేకర్స్. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా డైరెక్టర్ కృష్ణవంశీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలోనే రమ్యకృష్ణ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కృష్ణవంశీ మాట్లాడుతూ.. రమ్యకృష్ణ పాత్ర పవర్ ఫుల్గా డిజైన్ చేశాను. మా ఇంట్లో ఏ నిర్ణయమైనా నా భార్యే తీసుకుంటుంది. ఒకవేళ రమ్య లేనప్పుడు మేము నిర్ణయం తీసుకున్నా దానిలో మార్పులు చేర్పులు చేయమని సూచిస్తూ ఉంటుంది. అయితే నేను అది పెద్దగా పట్టించుకోను. అది వేరే విషయం. ఇకపోతే రమ్యకు శక్తివంతమైన కళ్లు ఉన్నాయి. అరుపులు, కేకలు కాకుండా కళ్లతోనే నటించాలి అనగానే ఆమె ఈ సినిమా ఒప్పుకుంది. తన మేకప్, హెయిర్ స్టైల్ తానే చేసుకుంది. తనెప్పుడూ ఒక విజన్తో ముందుకెళ్తుంది అని చెప్పుకొచ్చారు కృష్ణవంశీ.
ఈ సినిమాలో లాస్ట్ చాప్టర్లో తనను షూట్ చేయడానికి చచ్చిపోయాననుకో! దాదాపు 36 గంటలపాటు షూటింగ్ జరిగింది. తనను ఆ సీన్లో చిత్రీకరించడానికి సెంటిమెంట్ అడ్డొచ్చింది, కానీ తప్పదు కదా! షూట్ చేస్తుంటే కళ్ల వెంబడి నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఆ రాత్రి నేను సరిగా నిద్రపోలేకపోయాను. ఒకరకంగా చెప్పాలంటే గుండె రాయి చేసుకుని షూటింగ్ చేశా అని చెప్తూ కంటతడి పెట్టుకున్నారు కృష్ణవంశీ. కాగా కృష్ణవంశీ ఇంటర్వ్యూలో చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.