Erode: ప్రియుడి ముఖాన్ని కాల్చేసిన ప్రియురాలు.. ఎందుకంటే?

Erode: ఈ మధ్యకాలంలో సమాజంలో జరిగే కొన్ని ఘటనలు ఆశ్చర్యం కలిగిస్తే,మరికొన్ని ఘటనలు విన్నప్పుడు చూసినప్పుడు భయం వేస్తూ ఉంటుంది. తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. తమిళనాడు, ఈరోడ్‌లోని భవానీ ప్రాంతానికి చెందిన మీనాదేవీ, కార్తీక్‌ ఇద్దరు డిగ్రీ చదివే సమయం నుంచి మంచి స్నేహితులు. మూడేళ్ల క్రితం మీనాదేవికి కార్తీక్‌ బంధువైన వ్యక్తితో పెళ్లి జరిగింది. అయితే పెళ్లి జరిగినా కూడా వారు స్నేహాన్ని కొనసాగించారు. అయితే అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఈ నేపథ్యంలోనే కార్తీక్‌ మరొక యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకోవటానికి కూడా సిద్ధమయ్యాడు. ఈ విషయం మీనాకు తెలియడంతో తనకు ద్రోహం చేయవద్దని బ్రతిమాలింది. ఇద్దరమూ పెళ్లి చేసుకుందాం అని కూడా అడిగగా అందుకు కార్తీక్‌ ఒప్పుకోలేదు. అయితే కార్తీక్ అలా మాట్లాడటాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. తనని కాదని వేరే యువతిని అతడు పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడటాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఈ క్రమంలోనే కార్తీక్ పై పగ పెంచుకుంది. తనకు దక్కనిది వేరే వాళ్లకు దక్కకూడదు అనుకుంది. అనుకున్న విధంగానే పక్కా ప్లాన్‌ వేసుకుంది. శనివారం కార్తీక్ ని మాట్లాడటానికి పిలిచింది.

 

ఈ నేపథ్యంలోనే అతడి ముఖంపై బాగా కాలుతున్న నూనె పోసింది. దాంతో కార్తీక్‌ కుప్పకూలాడు. బాధతో విలవిల్లాడిపోయాడు. అప్పుడు కార్తీక్ పరిస్థితి గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి వెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు మీనాను అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు మీనా చేసేదేమీ లేక పోలీసుల ముందు లొంగిపోయి నిజాన్ని ఒప్పేసుకుంది.

Related Articles

ట్రేండింగ్

Volunteers Joined In TDP: నెల్లూరు టీడీపీలో చేరిన 100 మంది వాలంటీర్లు.. జగన్ కు ఇంతకు మించిన షాక్ ఉండదుగా!

Volunteers Joined In TDP: ఏపీలో వైయస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన అన్నట్టు...
- Advertisement -
- Advertisement -