Telangana: ప్రియుడిని ఆఖరిచూపు చూసుకోవడానికి వెళ్లిన ప్రియురాలు చివరికి అలా?

Telangana: ఈ మధ్య కాలంలో యువత ప్రేమ పేరుతో జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. ప్రేమ పెళ్ళికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకుని చనిపోవడం, తనకు దక్కని వ్యక్తి మరొకరికి దక్కకూడదని ప్రేమికులు ఒకరినొకరు హత్య చేసుకోవడం, ప్రియుడు ఆత్మహత్య చేసుకుందని ప్రియురాలు కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోవడం లాంటి ఘటనలు తరచూ ఏదో ఒక ప్రదేశంలో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే.. ఈ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. పట్టణంలోని గంటవీధికి చెందిన బోయ రామేశ్వరి 22 ఏళ్ల యువతీ డిగ్రీ పూర్తి చేసింది. గాంధీ చౌక్‌లో ఉండే రామతులసి అనే మహిళ ఆరోగ్య బాగోగులు చూసేందుకు వారి ఇంట్లో ఉండిపోయింది. చదువుకునే రోజుల్లో కర్నూలుకు చెందిన జయంత్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. అయితే కుటుంబ సమస్యల కారణంగా జయంత్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక విషయం తెలుసుకున్న రామేశ్వరికి గుండె పగిలినంత పనైంది. దాంతో వెంటనే స్నేహితురాలు సంగీతతో కలిసి జయంత్ అంత్యక్రియలకు వెల్లింది. ప్రియుడు లేడు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది.

 

తీవ్ర మనస్థాపానికి గురయింది. దాంతో ఏం చేయాలో తెలియని రామేశ్వరి తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే తిరిగి విధుల్లో భాగంగా రామ తులసి ఇంటికి వచ్చిన రామేశ్వరి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఆత్మహత్యకు ఒడిగట్టింది. ఫ్యానుకు ఉరి వేసుకుని బలన్మరణానికి పాల్పడింది. ఇక మరుసటి రోజు విధులకు వచ్చిన సంగీత ఫ్యానుకు వేలాడుతూ కనిపించిన స్నేహితురాలిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యింది. వెంటనే బంధువులు, పోలీసులకు సమాచారం అందించింది. ఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు వివరాలు సేకరించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు. రామేశ్వరి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు..

Related Articles

ట్రేండింగ్

Chandrababu: కుప్పంలో గెలుపు కోసం చంద్రబాబు వ్యూహాలివే.. ఎదురుగాలి వీస్తోందని అలా చేస్తున్నారా?

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రజా గళం పేరిట పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే గత కొన్ని దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు కుప్పంలో...
- Advertisement -
- Advertisement -