Sonu Sood: సోనూసూద్ ను కలవడానికి నడిచి వెళ్లిన వ్యక్తి.. చివరకు?

Sonu Sood: సోనూసూద్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కరోనా అలాంటి విపత్కర పరిస్థితులలో ఎంతోమందికి అండగా నిలిచి రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నాడు. కరోనా లాక్‌డౌన్ సమయంలో వేలాది కార్మికులకు అండగా నిలిచి రియల్ హీరోగా మారాడు నటుడు సోనూసూద్. లక్షలాది మంది ప్రజలకు ఆహారం అందించడంతో పాటు వలస కూలీలను వాహనాల్లో వారి వారి గమ్య స్థానాలకు చేర్చాడు. సోను సూద్ సినిమాలలో చేసేది విలన్ పాత్రలే అయినప్పటికీ సాయం కావాలంటూ తనదగ్గరకు వచ్చినవారందరికీ లేదనకుండా అతనికి తోచిన సహాయం చేశాడు.

ఇప్పటికీ కూడా సోనూసూద్‌ సహాయం చేస్తూ కలియుగ కర్ణుడిగా ముద్ర వేసుకున్నాడు. సోనూసూద్ ని వేలాది మంది ప్రజలు దేవుడిగా భావిస్తున్నారు. కరోనా లాంటి విపత్కర సమయంలో సోను సూద్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. కాగా ఇప్పటికే గతంలో చాలామంది సోను సూద్ ని కలవడం కోసం సైకిల్ పై, చాలా దూరం వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా కూడా సోను సూద్ ని ఎంతగానో అభిమానించి ఒక వీరాభిమాని సోనుసూద్ కోసం దాదాపుగా 700 కిలోమీటర్లు నడిచి వెళ్ళాడు. అయితే ఒక ప్రముఖ టీవీ ఛానల్ అతని ఇంటర్వ్యూ చేయగా కలవడం తనకు ఒక గొప్ప అనుభూతి అని ఆ విషయాన్ని జీవితంలో తను మర్చిపోలేను అని తెలిపారు.

 

సోను సూద్ ని కలవడం తనకు సంతోషంగా ఉందని ఆ క్షణాలను మధురమైన జ్ఞాపకాలను జీవితాంతం గుర్తుంచుకుంటానని తెలిపారు. కాగా సోను సూద్ తనకోసం దాదాపు అన్ని కిలోమీటర్ల నడుచుకొని వచ్చిన అభిమానికి ఒక మొబైల్ ఫోన్ గిఫ్ట్ గా ఇవ్వడంతో పాటు తన సొంత ఖర్చులతో అతనికి ఒక ఫ్లైట్ టికెట్ తీసుకొని ఫ్లైట్ ఎక్కించి అతని గమ్యస్థానానికి చేర్చాడు. అంతేకాకుండా అదనపు ఖర్చులకోసం అతనికి 5000 రూపాయల డబ్బులు కూడా ఇచ్చారట. అలాగే తనకు ఏదో ఒక విధంగా సహాయ పడతానని హామీ ఇచ్చారట. ఇదే విషయాన్ని సదరు వ్యక్తి మీడియాకు తెలిపారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -