Chiranjeevi: నిర్మాత సంచలన వ్యాఖ్యలు.. చిరంజీవికి ఆ పని రాదంటూ?

Chiranjeevi: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన అంబికా కృష్ణ.. అంబికా కృష్ణ అనే థియేటర్స్ ని నడిపిస్తూ అంబికా దర్బార్ భక్తి వంటి అగ్రత్తుల ఫ్యాక్టరీలను కూడా మైంటైన్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఈమె పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించింది. కన్యాదానం, ఆడంతే అదో టైపు, జంప జిలాని, వీరభద్ర, ఒకే మాట, మనసున్న మారాజు వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించింది అంబికా కృష్ణ. కేవలం బిజినెస్ సినిమాల ఇండస్ట్రీ పరంగానే కాకుండా రాజకీయాలలో కూడా టీడీపీ లోకి ఎంట్రీ ఇచ్చి పలు పదవులలో రాణించింది అంబికా.

ఇది ఇలా ఉంటే తాజాగా ఆమె హీరో హీరోయిన్ల గురించి స్పందిస్తూ పలు షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వీరభద్ర సినిమా సమయంలో హీరోయిన్ తను శ్రీ దత్త చేసిన పనుల గురించి స్పందించింది అంబికా. వీరభద్ర సినిమా షూటింగ్ విదేశాల్లో జరుగుతుండగా ఉదయాన్నే షూటింగ్ సెట్స్ కి సూట్ కేస్ పట్టుకొని వచ్చిందట తనుశ్రీ. మరి కొద్దిసేపట్లో షూటింగ్ మొదలవుతుంది అనుకుంటుండగా అప్పుడే తను శ్రీ నాకు ఇండియాలో పని ఉంది అర్జెంటుగా టికెట్ వేయండి నేను వెళ్లిపోవాలి అనిందట.

 

మా నాన్నకు హెల్త్ కండిషన్ బాగోలేదు సీరియస్ గా ఉంది నాకు వెంటనే టికెట్ వెయ్యండి అని ఆమె అడిగిందట. అయితే అక్కడ హీరో తో పాటు అందరూ కూడా సినిమా కోసం ఎదురు చూస్తూ హీరోయిన్ కి వెళ్లొద్దు అని ఎంత నచ్చజెప్పినా కూడా ఆమె వినిపించుకోలేదట. ఇప్పుడు ఒక పూట అంతా కూడా వాళ్ళ నాన్నతో మాట్లాడించిన తర్వాత అప్పుడు మౌనంగా ఉందట. చాలా పొగరు చూపిస్తారు అలాంటి వాళ్ళు. అంత పెద్ద హీరో బాలకృష్ణ ఎప్పుడు కూడా పొగరు చూపించరు. హీరో బాలకృష్ణ ఇన్ని గంటలకు షూటింగ్ అంటే అన్ని గంటలకు మాత్రమే వస్తారు ఎప్పుడూ కూడా లేటు వచ్చిన దాఖలాలు లేవు అని తెలిపింది అంబికా.

 

ఇలా లేటుగా వచ్చే హీరోలు వేరే ఉన్నారు. వారే హీరో ఉపేంద్ర, శ్రీకాంత్ అని తెలిపింది అంబిక. అనంతరం రాజకీయాల గురించి మాట్లాడుతూ.. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టాక కొన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిచిన పార్టీ నడపడం చేతకాలేదో లేక పార్టీని నడపడానికి తీరికలేదో తెలియదు కానీ ఆ పార్టీని విడిచి పెట్టేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది అంబిక. అందుకే ప్రజారాజ్యం పార్టీ పోయింది. అప్పుడు కనుక చిరంజీవి ఆ పార్టీని పట్టించుకోని ఉంటే ఇప్పుడు ఆ పార్టీ బాగా ఉండేది అని తెలిపింది.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -